ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మీడియా ఎంతగా చైతన్యవంతం చేస్తున్నా ఆడబిడ్డలపై కొందరి ఆలోచనా విధానం మారటంలేదు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల ఏరంగంలోనూ తీసిపోకుండా ముందుకు దూసుకెళ్తున్నాకానీ వీరు కళ్లు తెరుచుకోవటంలేదు. ఆడబిడ్డైనా, మగబిడ్డైనా ఒకటే నన్న ఇంగిత బుద్ధిని మరిచి సభ్యసమాజం తలదించుకునే వికార చేష్టలకు తెగబడుతున్నారీ మూర్ఖశిఖామణులు.
ఇవాళ విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం దత్తంగలో ఇలాంటిదే ఓ దారుణం జరిగింది. రెండోసారి ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్న భార్యకు నిప్పుపెట్టాడో కర్కోటకుడు. మహిళ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇద్దరు పిల్లలు ఆనాథలయ్యారు.
మరో దారుణమైన సంఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో నేడు చోటు చేసుకుంది. నవమాసాలూ మోసి, కని, పెంచిన సాక్షాత్తూ అమ్మనే పొట్టనబెట్టుకున్నాడో..... జిల్లాలోని అర్బన్ మండలం జగ్యాతండాలో ఓ కసాయి కొడకు కన్నతల్లిని దారుణంగా కొట్టి చంపాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే.. మరో అరాచక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలో పాఠశాల టీచర్ను దారుణంగా విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు 9వ తరగతి చదువుతున్న టీనేజ్ విద్యార్థి. పారిస్ కార్నర్ సమీపంలోని ఆర్మేనియన్ వీధిలోని సెయింట్ మేరీస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది.
హతురాలు ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి (40) గత 10 ఏళ్లుగా ఇదే పాఠశాలలో విజ్ఞానశాస్త్రం బోధిస్తోంది. పాఠశాల గదిలో ఒంటరిగా ఉన్న తరుణంలో విద్యార్థి కత్తితో ప్రవేశించి ఆమె గొంతు కోసి పొట్టలో పొడిచి హత్యచేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ విద్యార్థి వయసు 15 ఏళ్లని, పేరు మొహమ్మద్ ఇర్ఫాన్ అని తెలుస్తోంది. ఇర్ఫాన్ను టీచర్ తిట్టడం వల్లే ఈ దాడి చేశాడని సమాచారం.
…avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more