ఈరోజు సిబిఐ అధికారుల ముందు ఐఏఎస్ అధికారిణి హాజరయ్యారు. ఈమె కర్నాటక క్యాడర్ కి చెందిన రత్నప్రభ. దివంగత నేత వైయస్ ఆర్ హయాంలో ఈమె ఐటి సెక్రటరీగానూ, అర్బన్ ల్యాండ్ యుఎల్ సి గానూపనిచేసారు. రత్నప్రభను జగన్ అక్రమ ఆస్తుల విషయంలో ప్రశ్నించటానికి సిబిఐ పిలుపనిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా సిబిఐ ఈ విధంగా ఐఏఎస్ లను ప్రశ్నించటం, అరెస్ట్ లు చెయ్యటాలు ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేపుతోంది. జివోలు జారీ చెయ్యటానికి వెనుకాడుతున్నారు. నిర్ణయాలు తీసుకునేది మంత్రులైతే జీవో మీద సంతకం పెట్టినందుకు మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారంటూ ఐఏఎస్ లు ఆవేదన వెలిబుచ్చుతూ ముఖ్యమంత్రిని కలిసారు. ఎంతోకష్టపడి చదివి ఐఏఎస్ గా దేశసేవ చేద్దామని మేమొస్తే మమ్మల్ని అనవసరంగా వేధిపులకు గురిచేస్తున్నారంటూ ఐఏఎస్ లు ఆందోళనచెందటమే కాకుండా, సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను పెండింగ్ లో పెడుతున్నారు. ఏమంటే, మేము సిబిఐ విచారణనెదుర్కోవలసివస్తుందని అంటున్నారు లేదా ఏదో సాకుతో తప్పించుకుంటున్నారని సమాచారం.
అయితే ఇలా ఐఏఎస్ ల మీద అభియోగాల మీద భిన్న భావాలు వ్యక్తమౌతున్నాయి. ఐఏఎస్ అయినా తప్పు చేసినప్పుడు చట్టం దృష్టిలో ఒకటే. తప్పు చెయ్యకపోతే భయపడాల్సిన వనేలేదు. అభియోగాలుంటే కోర్టులో విచారణ సాగుతుంది. అక్కడ తన తరఫు వాదనను వినిపించుకోవచ్చు అంటారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది.
క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకుని మాదగ్గరకు పంపిస్తారు. జీవో పాస్ చెయ్యవలసిందిగా మమ్మల్ని ఆదేశిస్తారు. నిర్ణయం తీసుకున్నది నాయకులైనప్పుడ అధికారులను తప్పు పట్టటమెందుకన్నది ఐఏఎస్ ల వాదన. వాటి మీద సంతకాలు చెయ్యకుండా ఏమైనా విమర్శలు చేస్తే వారు మంత్రుల ఆగ్రహానికి గురౌతారు. అలాగైనా వేధింపులు తప్పవు. శాఖల్లోంచి బదిలీలు చేస్తారు. తరచు బదిలీలతో వారి కుటుంబ బాధ్యతలూ, పిల్లల చదువులూ కూడా దెబ్బతింటున్నాయి. బదిలీలో మరో చోటికి వెళ్లినప్పుడు పరిస్థితులను ఆకళింపు చేసుకోకముందే మరో ఒత్తిడి వస్తుంది. ఆంతా బాగానే ఉందిలో సంతకం చెయ్యమంటారు నాయకులు.
వాళ్ళు చెప్తే మేం చేసామన్నది అర్థంలేని వాదనంటారు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ. అలా చేసేట్టయితే ఐఏఎస్ ల వరకూ ఎందుకు, ఒక గుమస్తా చాలు కదా, ఒక బంట్రోతే చెయ్యగలడా పని అంటారాయన. మంత్రులు తమ మీద ప్రజల నుండి వచ్చిన ఒత్తిడిలు వలనో మరే విషయంలోనో కొన్ని చట్టాలు చెయ్యాలనుకుంటారు. అయితే వాటి సాధ్యాసాధ్యాలు, చట్టపరంగా వాటికున్న అధికారికత ఇవన్నీ చూడవలసిన బాధ్యత అధికారులదే కదా. వారున్నదే అందుకోసం. అందువలన తప్పు చేస్తే కచ్చితంగా జవాబుదారీ ఆ అనుమతులిచ్చిన అధికారులదే అంటారు మరికొందరు రాజకీయ విశ్లేషకులు.
ఏది ఏమైనా సిబిఐ ప్రవర్తన పట్ల కినుక వహించిన ఐఏఎస్ లు అందుకు దీటుగా ఏ చర్య తీసుకుంటే బావుంటుందా అని ఆలోచిస్తున్నారు. కానీ దర్యాప్తు చేస్తున్న సిబిఐ మాత్రం ఏం చేస్తుంది. దర్యాప్తు చెయ్యటానికి ముందు ప్రారంభించాల్సిన చోటే నిర్ణయం తీసుకున్న దగ్గర్నుంచే కదా.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more