వినోదం కోసం ఆడే క్రీడ విషాదం తెచ్చిపెట్టింది. యూరప్, అమెరికాల్లో ఎక్కువగా అభిమానించే ఫుట్ బాల్ క్రీడ ఆ అభిమానం కాస్తా ప్రాణాల మీదకు వచ్చేతగా పట్టింపుల్లోకి దారితీస్తుందని ఎవరూ ఊహించరు. కానీ ఉత్తర ఈజిప్ట్ లో జరిగిందదే. 74 మంది చనిపోయారు, 1000 మంది గాయపడ్డారూ అంటే జరిగిన దొ్మ్మీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పోర్ట్ సయ్యద్ లో 3-0 తో గెలిచిన స్థానిక జట్టు అల్ మస్రి అభిమానులు వెంటనే క్షణాల్లోనే మైదానంలోకి దూకి, కయిరోకి చెందిన అల్ అహ్లి జట్టు మీద దాడి చేసారు. ఆ సమయంలో అక్కడే ఉన్నా, పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు కానీ ఆపే ప్రయత్నం చెయ్యలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 3000 మంది పోలీసులు అక్కడే ఉన్నారు కానీ ఎవరినీ అరెస్ట్ చెయ్యకపోవటం దురదృష్టకరమని అంటున్నారు.
నిజానికి అల్ మస్రి విజయం సాధించటం చాలా గొప్పే. ఎందుకంటే అల్ అహ్లి దేశంలోనే అగ్రస్థానం లో ఉన్నఫుట్ బాల్ జట్టు. అలా ఓడిపోయినవారిమీద కసి ఎందుకన్నది ఎవరికీ అర్థం కాలేదు. బహుశా వాళ్ళు గెలుస్తారేమోనని ముందే తయారుగా ఉన్నట్టున్నారు. క్రీడా సంఘ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ దీన్ని ఫుట్ బాల్ చరిత్రలో ఒక చీకటి దినంగా ప్రకటించారు. అల్ అహ్లి జట్టులో డాక్టర్, ఇది ఫుట్ బాల్ కాదు ఇదో సంగ్రామమే అన్ని అన్నారు. ఫుట్ బాల్ కాదు ఫుట్ వార్ అయింది.
ఇందులో రాజకీయ కోణం కూడా తొంగి చూసింది. తాజాగా ఎన్నికల్లో అధిక స్థానాలు సంపాదించిన ముస్లిం బ్రదర్ హుడ్, ఈ హింసాత్మక సంఘటనకు ముబారక్ మద్దతుదార్లదే బాధ్యతంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more