రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం గండికొడుతున్నది. రాష్ట్రాన్ని కాదని కేంద్రం తమిళనాడు విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తున్నది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్(సీజీఎస్) నుంచి తమిళనాడుకు 540 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి కేంద్రం అనుమతించింది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ను ఏవిధంగా అధిగమించాలనే అంశంపై ఇప్పటికే ట్రాన్స్కో తలలు పట్టుకుంటుండగా, కేంద్ర ప్రభుత్వ చర్య మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. సదరన్ కారిడార్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ పంపిణీ ఒప్పందాలను తమిళనాడు ప్రభుత్వం కాలరాస్తున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని పెద్దలు చేష్టలుడిగినట్లుగా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉంది. కేంద్ర సర్కారులో ఐదుగురు కీలక మంత్రులతో పాటు రాష్ట్రం నుంచి 33 మంది అధికారపార్టీ లోక్సభ సభ్యులు, పది మందికి పైగా రాజ్యసభ సభ్యులున్నా ఆచరణలో ఫలితం లేకుండా పోతున్నది.
రాష్ట్రంలో వేసవిలో విద్యుత్ అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఎపీ ట్రాన్స్కో, డిస్కమ్లు టెండర్లను నిర్వహించాయి. ట్రాన్స్కో ప్రతిపాదించిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కాంట్రాక్టు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కారిడార్ సమస్య వల్ల నాలుగు నెలల కాలానికి 540 మెగావాట్లకు మాత్రమే కారిడార్ అనుమతి లభించింది. ఇది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రోజుకు 540 మెగావాట్ల మేరకు 24 గంటల పాటు విద్యుత్ పంపిణీకి వీలుగా ట్రాన్స్కోతో ఒప్పందాలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వం వారం రోజుల ముందుగా కారిడార్ అనుమతికోసం చేసిన రాజకీయ ప్రయత్నాలు ఫలించాయి. ఫలితంగా సదరన్ కారిడార్ నుంచి ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు తమిళనాడు అవసరాలకోసం 540 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి వీలుగా కేంద్రం అనుమతించింది. దీంతో అప్పటి వరకు ఆంధ్రవూపదేశ్ విద్యుత్కంపెనీలైన ట్రాన్స్కో, డిస్కమ్లకు ఉన్న సదుపాయాన్ని రద్దు(క్యాన్సల్) చేస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్), సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ)లు ఆదేశాలు జారీచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more