తల్లిదండ్రులు కేటాయించే ప్రతి నిమిషం పిల్లల భవిష్యత్తుకు వెలకట్టేలేని పెన్నిధి అంటున్నారు పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు. ‘ఆధునిక జీవనంలో ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు?’ అనే అంశం మీద ఈ యూనివర్సిటీ పరిశోధకులైన గ్యారీ, వ్యాలెరీలు ఇటీవల ఓ నివేదికను పొందుపరిచారు. వారానికి 168 గంటలు ఉంటే... అమెరికాలోని విద్యావంతులైన తల్లులు తమ పిల్లలకోసం 21 గంటలు, తండ్రులు 9-10 గంటలు మాత్రమే కేటాయిస్తున్నట్టు తెలిసింది. అక్షరం జ్ఞానం అసలే లేని తల్లిదండ్రులు 16 గంటల కన్నా తక్కువ సమమయే పిల్లలతో గడుపుతున్నట్టుగా గుర్తించారు.
చదువుకున్న వారైనా, చదువు లేనివారైనా రోజువారి పనుల తర్వాత పిల్లలకన్నా టీవీ, ఫోన్, కంప్యూటర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ తరహా అలవాటు మనదేశంలో తక్కువేమీ లేదు. మారుతున్న కాలంలో పనుల ఒత్తిడి తండ్రితో పాటు తల్లికీ చేరిపోయింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు అవడం వల్ల ‘పిల్లలతో గడిపే సమయం ఎక్కడుంది?’ అని నిరుత్సాహం వ్యక్తం చేస్తుంటారు. కాని ఇల్లు చేరుతూనే టీవీలకో, ఫోన్లకో, కంప్యూటర్లకో... చెవులు, కళ్లు అప్పగించే తల్లిదండ్రుల సంఖ్యే ఎక్కువ గా ఉంటోంది. ఫలితంగా తలిదండ్రులు- పిల్లల మధ్య బాంధవ్యాలు పలచబడి పోవడమే కాకుండా, అభద్రత, ఆందోళనలు, మానసిక సమస్యలతో పిల్లలు చెడుదారుల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైల్డ్ సైకియాట్రిస్టులు చెబుతున్నారు. పెద్దల నిర్లక్ష్యం పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయగలదని హెచ్చరిస్తున్నారు. టీవీల కన్నా పిల్లల బాల్యం ఎంతో విలువైనదిగా గుర్తించమని సూచన చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more