Highest statues of the worlds and political statues of ap

highest statues of the worlds and political statues of ap, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

highest statues of the worlds and political statues of ap, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

statues-1-2.gif

Posted: 01/19/2012 01:15 PM IST
Highest statues of the worlds and political statues of ap

"నేను చనిపోయిన తర్వాత నా విగ్రహం పెట్టకండ"ని ఆఖరి క్షణాల్లో తన కోరికను వెలిబుచ్చాడట ఓ నాయకుడు. "ఎందుకు?" అని అడిగితే, "దాని మీద ముఖ్యంగా తలమీద కాకులు వాలి, మలినం చేస్తాయి" అని అన్నాడట.

ntrనిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైయస్ ఆర్ విగ్రహాల మీద వ్యాఖ్యానం చేసారు. అనుమతులు లేని విగ్రహాలను పడగొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అది జరగకపోతే లక్ష ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టిస్తామని ఆయన అన్నారు. అయితే పార్లమెంటులో ప్రతిష్టించవలసిన ఎన్టీఆర్ విగ్రహం వర్గపోరాటం వల్లనే ఇంతవరకూ జరగకుండా నిలిచిపోయిందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు.

ysrవిగ్రహ ప్రతిష్ట చెయ్యటానికి ప్రభుత్వ అనుమతులు అవసరమే. కానీ ఈ మధ్యకాలంలో అనుమతుల జోలికి పోకుండా విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఎక్కడ విగ్రహాలను ప్రతిష్టించినా వాటిని వారి అభిమానులు చేరి వాటిని అక్కడ నిలబెట్టినట్టుగా చెప్పినా, ఆ విగ్రహాల వెనుక రాజకీయాంశాలు చోటుచేసుకుంటాయన్నది అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఆ నాయకుడి పేరుతో రాజకీయ లబ్ధి కోసమే విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ట వలన పార్టీ ప్రతిష్ట ను అది కొన్నాళ్ళు నిలబెడుతుందని పార్టీల ఆశాభావం. ఎంత అందరికీ తెలిసిన ఉత్పాదనైనా, అది వినియోగదారులు మదిలోంది తొలగిపోకుండా ఉండటం కోసం అందరూ చూసేచోట పెద్ద పెద్ద హోర్డింగ్స్ రూపంలో వ్యాపార ప్రకటనలు ఎలా చేస్తారో అలాగే, రాజకీయ నాయకుల మీద ప్రజల కున్న అభిమానం అణగారిపోకుండా ఉండటం కోసం వారి విగ్రహాలను ప్రతిష్టించటం జరుగుతోంది.

ఇదే పంథాలో ఉత్తర ప్రదేశ్ లో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాలు, ఆమె పార్టీ బిఎస్పీ ఎన్నికల చిహ్నమైన ఏనుగలు విగ్రహాలు కూడా భారీగానూ, విరివిగా నూ ప్రతిష్టించబడ్డాయి. అందువలన వాటిమీద ముసుగు కప్పమని ఎన్నికల అధికారి ఆదేశాలు కూడా అమలు జరిగాయి.

ట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా విగ్రహ ప్రతిష్టలు కూడా చెయ్యాలనుకున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన పార్టీ ప్రతిష్టను ఇనుమడించేవి కాకుండా తెలుగు సంస్కృతికి అద్దం పట్టే విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుకోవటం ముదావహమే కానీ, ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ వయసే చాలా తక్కువ. ఇక అందులో ప్రతిష్టను పెంచే నాయకులెవరున్నారప్పుడు. అయితే కొన్ని విగ్రహాల్లో ఎన్టీఆర్ ముఖకవళికలు కనిపిస్తున్నాయని కొందరు ఆరోపించారు. కానీ బుద్ధ విగ్రహాన్ని తప్పు పట్టటానికి లేదు. దానివలన రాజకీయ లబ్ధి కలిగిందని ఆరోపించటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిలాగా తను జీవించినప్పుడే తన సొంత విగ్రహాలను ప్రతిష్టించుకునే స్థాయికి ఎన్టీఆర్ దిగజారలేదు.  అయినా టాంక్ బండ్ మీద కొన్ని విగ్రహాలు ఉండటం, కొన్ని లేకపోవటం తెలంగాణా వాదులకు ఆగ్రహాన్ని తెప్పించి ధ్వంసానికి పూనుకునేట్టుగా చేసింది.

 నాయకుల విగ్రహా ప్రతిష్టల వలన ప్రతిష్ట పెరగటమేమో కానీ పాలకవర్గానికి చికాకులు ఎదురవటం కూడా జరుగుతుంది. ఏ రోడ్డు విస్తరణ కోసమో, లేదా మరేదైనా ప్రజా ప్రయోజనం కోసమో ఆ విగ్రహాన్ని తొలగించవలసి వస్తే ఆ పని వారికి చాలా కష్టమౌతుంది. ఎన్నో నిరసనలు, ఆందోళనలు చెలరేగుతాయి. ఒకప్పుడు ఎక్కడ బడితే అక్కడ చిన్న చిన్న గుడులు కట్టి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగించేవారు. వాటి స్థానంలో ఇప్పుడు విగ్రహాలు వస్తున్నాయి. విగ్రహాలు, స్థూపాలు, జెండాలు చూసి ఎవరూ ఓటెయ్యరు అని ఒక నాయకుడు అన్నారు. అవి చూసి వేస్తారని కాదు కానీ, వారి మదిలో ఆ నాయకులమీద అభిమానం చెరిగిపోకుండా ఉండటం కోసమే ఆ ప్రయత్నం. ఆ అభిమానమే లేనివారి ఇంటి ముందు విగ్రహాన్ని ఉంచినా ఏమీ తేడా ఉండబోదు.

ప్రాచీన శోభలను sphinxవెదజల్లే విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనీ అతి ఎత్తైన విగ్రహాలలో ఒకటి ఈజిప్ట్ లో గిజాలోని స్ఫింక్స్. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో నిర్మించబడిందని చరిత్రకారులంటారు. హిందూ దేవుళ్ళో నరసింహావతారంలో మానవ శరీరానికి సింహం తల ఉంటే, ఈ స్ఫింక్స్ కి సింహం శరీరానికి మానవ శిరస్సు ఉంటుంది. కింగ్ కాఫ్రే పిరమిడ్ కి సమీపంలో ఉన్న ఈ విగ్రహం ఎత్తు 65 అడుగులు, కింద భాగంలో పొడవు 241 అడుగులు, వెడల్పు 20 అడుగులు.

christప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహాల్లో మరొకటి కోర్కావిడో పర్వతం అంచున ఉన్న ఎత్తు 130 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం. ఇది 1931 లో ప్రతిష్టించబడింది.

libertyఅమెరికా లోని లిబర్టీ విగ్రహం ఎత్తు 151 అడుగులు. ఇది 1886 లో నిర్మించబడింది. ఇది అమెరికన్ దేశస్తులకు ఫ్రాన్స్ వారి బహుమానం.

budhaమరో పెద్ద విగ్రహం 174 అడుగుల ఎత్తైన బామ్యన్ బుద్ధా. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో బామ్యన్ లోయలో ఉండేది. దీన్ని తాలిబాన్లు ధ్వంసం చేసారు.

motherరష్యాలోని మామాయేవ్ కుర్గన్ లోని మదర్ మదరే ల్యాండ్ విగ్రహం ఎత్తు 279 అడుగులు. ఇదే ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన విగ్రహం. ఇది 1960 లో ప్రతిష్టించబడింది.

 

ప్రపంచంలోని ఈ విగ్రహాలు, మరికొన్ని విగ్రహాల గురించి తెలుసుకుంటే మనమెక్కడున్నాం, మన ఆలోచన పరిధి ఎంతవరకూ ఉందన్నది తెలుస్తుందనే వీటి ప్రస్తావన తీసుకునిరావటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hand loom minister sankarrao not yet informed of ousting
Pak pm before supreme court amidst high security arrangements  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles