అభ్యంతరకరమైన అంశాలను తొలగించకపోతే గూగుల్, ఫేస్ బుక్ లు చట్టపరంగా శిక్షలకు సిద్ధం కావలసివస్తుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్ మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. సోషల్ సైట్స్ మీద నియంత్రణ అవసరమని అన్న టెలికం మంత్రి కపిల్ సిబాల్ మాటలతో తను ఏకీభవిస్తానని చెప్పిన జస్టిస్ కట్జూ, రోజుకి కొన్ని లక్షల పోస్టింగ్స్ జరుగుతున్నప్పుడు వాటిని నియంత్రించటం కష్టమని అన్న వాదనను అంగీకరించలేదు.
అంతకు ముందు ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించినట్టుగానే జస్టిస్ కట్జూ వార్తా పత్రికలను, మీడియా ఛానెల్స్ నూ వార్తల సేకరణ, ఎంపిక విషయంలో తప్పుపట్టారు. దేశంలో ఎన్నో సమస్యలుండగా, పేదరికం, రైతుల బలవంతపు ఆత్మహత్యలలాంటి విషయాలమీద కేంద్రీకరించకుండా ఎవరో సినిమా నటి గర్భవతి అయింది, జన్మనిచ్చింది, ఎవరో సినిమా నటుడు మరణించాడు లాంటివార్తలకు ప్రాముఖ్యతనిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరచారు.
చైర్మన్ పదవినలంకరించినప్పటి నుంచీ మీడియా ప్రక్షాళన దిశగా ఆత్రుత చూపిస్తున్న జస్టిస్ కట్జూ, తనని నియంతలా అందరూ భావిస్తున్నరని, నిదానంగా తనెవరో కౌన్సిల్ సభ్యులందరికీ అర్థమౌతుందని, ఒకవేళ తన ప్రతిపాదనలకు అందరూ ఒప్పుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మెజారిటీ చూస్తామనీ అన్నారు.
అయితే, ఇండియన్ రియాల్టీ షో బిగ్ బాస్ 5 లో భాగం వహించిన సన్నీ లియోన్ విషయంలో ఏమీ చెయ్యలేమని అనేసారు. సన్నీ లియోన్ రియాల్టీ షో ద్వారా తన వ్యక్తిగతంగా నడుపుతున్న ప్రోనో వెబ్ సైట్ ని అభివృద్ధి చేసుకుంటోందని ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ బిసిసిసి కి ఎన్నో ఫిర్యాదులందుతున్నాయి. ఆమె వెబ్ సైట్ హోం పేజ్ లోనే, బిగ్ బాస్ 5 లో ఆమెను చూసినట్టుగానే, ఆమె వివస్త్రకావటాన్ని కనులారా కాంచండి అంటూ ప్రకటన వస్తోందని ఫిర్యాదులు వచ్చాయి. అయినా మనదేశంలో ఆమె మన సమాజ నియమాలను ఉల్లంఘించే పనులేమీ చెయ్యలేదు కనుక ఆమెను సమాజంలో వెలివెయ్యలేం అన్నారు జస్టిస్ కట్జూ.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more