ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం ఫలించింది. ఢిల్లీ యాత్రను క్షేమంగా ముగించుకుని లాభంగా తిరిగివస్తున్నారు. ఏమిటా లాభమంటే మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం పచ్చజెండా చూపించింది. ఇదేం లాభమని అంటే, మరి ఆయన అడిగిందదే కాబట్టి లభించిన వరాలూ అవే. దేవుడి దగ్గరికిపోయి షర్ట్ బటన్ ఊడిపోయింది నాకో బటన్ ఇవ్వమని అడిగితే సరేనని దేవుడైనా ఇచ్చేది బటన్ మాత్రమే. మా రాష్ట్రంలో ఈ సమస్యలున్నాయి, వాటికి ఈ పరిష్కారమార్గం బావుంటుందని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు, మీరెంతవరక మద్దతునివ్వగలరు అని అడిగితే అది వేరేలా ఉండేదేమో. కానీ, రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలంటే జనం లోకి పోవాలి, జనంలోకి పోవాలంటే పథకాలుండాలి. పథకాలు ప్రవేశపెట్టాలంటే వాటికి మద్దతునిచ్చే మంత్రిమండలుండాలి. మద్దతునివ్వాలంటే అక్కడ నా వాళ్ళుండాలి కాబట్టి మంత్రి వర్గ ప్రక్షాళన చేసుకుంటేనే కానీ వీలవని పనులవన్నీ అందువలన నా మంత్రి వర్గ విస్తరణకు నాకు అనుమతినివ్వమని అన్నప్పుడు ఆ పర్యటన లాభదాయకమైందీ అని అంటే అధిష్టానం అందుకు ఒప్పుకోవటం జరిగింది.
ప్రజారాజ్యం పార్టీలోని చిరంజీవి సూచించినవారికి రెండు స్థానాలు, తెలంగాణా మంత్రులకు మూడు స్థానాలకు మొత్తం ఐదుగురిని అదనంగా మంత్రివర్గంలోకి తీసుకోవటానికి, ఇంకా ఉన్న మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చెయ్యటానికి కూడా ఆమోదాన్నందుకున్నారు కిరణ్ కుమార్. ఆజాద్ తోనూ ఆ తర్వాత సోనియా గాంధీతోనూ భేటీ అయిన కిరణ్ కుమార్ తను అనుకున్నది సాధించుకుని వచ్చారు. ఎవరూ తన మాట సరిగ్గా వినటం లేదు అని ఆరోపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి చేతికి ఇప్పుడో బెత్తం వచ్చినట్టే. ఎందుకంటే మంత్రి వర్గ విస్తరణతో పాటు ఎవరినైనా తీసివెయ్యటం కానీ, పదవుల్లో మార్పులు చెయ్యటం కానీ చెయ్యవచ్చు. ఇక ఆయన దగ్గరికి క్యూ కడతారనటంలో అతిశయోక్తి లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more