పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్కరానికి ఒకసారి చేసే గంగానమ్మ జాతర ఈ సంవత్సరం నవంబర్ 17 నుంచి మొదలైంది. ఫిబ్రవరి 13 వరకూ సాగే ఈ జాతరలో గంగానమ్మ, ఆదిమహాలక్ష్మి, వినుకొండ అంకమ్మ, పోతురాజులను ఈ మూడు నెలలూ భక్తితో కొలుస్తారు. ఈ పూజలు జరుగుతున్న కాలంలో మరే పండుగా, పెళ్ళిళ్ళ లాంటి శుభకార్యాలూ జరుపుకోరు. సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని ఇప్పటికీ పాటించే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులు సంక్రాంతి చేసుకోవటం లేదు.
ఈ మూడు నెలలూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి, అమ్మవారి అనువు రోజున బంధువులు మిత్రులను పిలిచి పండుగ జరుపుకుంటారు. అమ్మవారిని కొలవటం కన్నా ఏ పండుగా ఎక్కువ కాదంటారు పశ్ఛిమ గోదావరి జిల్లా వాసులు. నవంబరు 17 న తీసుకుని వచ్చిన గంగానమ్మ అమ్మవారు ఊళ్ళో ఉన్నన్ని రోజులూ పిండివంటలు చెయ్యటం, కొత్తబట్టలు కుట్టించుకోవటం లాంటి పండుగ సంబరాలేమీ చెయ్యరు. అలాంటి సమయంలో వచ్చిన సంక్రాంతి అవటం వలన ఈసారి ఏలూరులో సంక్రాంతిని పండుగగా చేసుకోవటం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more