అత్యంత కఠిన నియమాలు ఉన్న శబరిమల అయ్యప్పస్వామి ఆయయంలో అపచారం జరిగింది. శబరిమల ఆలయంలోకి మనరాష్ట్రానికి చెందిన సరస్వతి అనే మహిళ ప్రవేశిచింది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన మహిళలలో ఈమె రెండవ ఆమె. మన రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల సరస్వతి అనే మహిళ సోమవారం 18 మెట్లు ఎక్కి ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్న సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆమె స్వామికి పూజలు కూడా చేశారు. అయ్యప్ప ఆలయంలోకి పదేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశార్హత లేదు. అయినా.. సరస్వతి ప్రవేశించడంతో దాన్ని ఆలయపూజారులు అపచారంగా భావించారు.
దీంతో ఆలయాన్ని, 18 మెట్లను కడిగి ప్రధాన ఆలయాన్ని కూడా శుద్ధి చేసినట్లు ఆలయ యంత్రాంగం తెలిపింది. ప్రధాన పూజారి ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారని ట్రావన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు వివరించారు. సరస్వతి ప్రధాన ఆలయంలో పూజలు చేసుకుని, తర్వాత మల్లికాపురం ఉపాలయానికి వెళ్తుండగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆమెను గుర్తించ పట్టుకున్నారు. వారు ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు.
గతంలో కన్నడ సినీ నటి జయమాల తాను యుక్తవయసులో ఉండగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, స్వామి విగ్రహాన్ని ముట్టుకున్నట్లు కన్నడ నటి జయమాల 2006లో ప్రకటించి సంచలనం సృష్టించారు. దాంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గత సంవత్సరమే కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కేరళ హైకోర్టు గత సంవత్సరం అక్టోబర్లో స్టే విధించింది. ఇలా నిషేదం ఉన్న ఆలయాలలోకి మహిళలు ప్రవేశించి అపవిత్రం చేయకూడదని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more