లోక్ పాల్ బిల్లు తప్పక పెడతాం, లోక్ పాల్ ఈ శీతాకాలం సమావేశాల్లోనే ప్రవేశపెడతాం. నుంచి ఏకాభిప్రాయం కుదరటం లేదని, సాధ్యమైనంత వరకూ ఈ సమావేశాల్లోనే లోక్ పాల్ పెడతాం అనే వరకూ వచ్చింది. మాటలు ఇలా మారుతూ విషయం పల్చబడుతూ వస్తుందని ముందే తెలుసుకాబట్టి నాయకుల నాడి ఎరిగిన అన్నాహజారే 27 నుంచి దీక్ష ప్రారంభిస్తానని చెప్పటమే కాకుండా అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తుండటం పాలక వర్గంలో వణుకు పుట్టిస్తోంది.
ఒక్క ఢిల్లీలో మాత్రమే దీక్ష చేస్తే చాలదని భావించిన అన్నా ఈ రోజు బెంగళూరులో ప్రసంగించారు. రేపు చెన్నైలో ఎల్లుండి హైద్రాబాద్ లో అన్నా పర్యటించనున్నారు. బెంగళూరులో ఈ రోజు ఫ్రీడమ్ పార్క్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, తను ఎవరికీ భయపడేది లేదని, చావంటే ఏ మాత్రం భయం లేదని, అవినీతి మీద ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నానని, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆఖరి హెచ్చరిక అని చెప్తూ, పటిష్టమైన లోక్ పాల్ తెస్తారా లేక గద్దె దిగిపోతారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నంచారు.
దీనిమీద స్పందించిన ప్రధాన మంత్రి, దానిమీదనే కసరత్తులు చేస్తున్నట్టుగానూ, వీలయితే ఈ సమావేశంలోనే బిల్లుని ప్రవేశపెడతామని అన్నారు.
ఈరోజు అన్నా ప్రధాన మంత్రికి తాజా ఒక లేఖ రాస్తూ అందులో, ప్రభుత్వం అవలంబించే ధోరణి ఏమాత్రం బాగోలేదని, ఇంతవరకూ లోక్ పాల్ బిల్లు మీద హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు కానీ, ఈ నెల 23 వరకూ జరిగే పార్లమెంటు సమావేశాల్లో లోక్ పాల్ బిల్లు పెట్టటం అనుమానంగానే కనిపిస్తోందని తెలియజేస్తూ, సిబిఐ మీద నియంత్రణ ఒదిలిపెట్టలేకనే సిబిఐని లోక్ పాల్ కిందికి తీసుకుని రావటం లేదని, విచారణ చేపట్టే విభాగం లేకపోతే లోక్ పాల్ ఏం చెయ్యగలుగుతుందని ప్రశ్నస్తూ, పటిష్టమైన లోక్ పాల్ రాని పరిస్థితుల్లో 27 నుంచి మరోసారి దీక్ష, ఆతర్వాత జనవరిలో జైల్ భరో కార్యక్రమం తీవ్రతరమౌతుందని హెచ్చరిస్తూ, ఇప్పటి వరకూ తానే చేస్తానన్న ప్రధాన మంత్రి ఇప్పుడు స్టాండింగ్ కమిటీకి అప్పజెప్పటం కేవలం ప్రజలను మోసగించటమేనని ఆరోపించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more