Jagan yatras were successful

jagan yatras were successful, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jagan yatras were successful, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

odarpu-yatra1.gif

Posted: 12/17/2011 01:00 PM IST
Jagan yatras were successful

jagan3jagan2

"మా తండ్రిగారు నన్ను అనాథగా వదిలిపెట్టి పోలేదు.  నాకో పెద్ద కుటుంబాన్నిచ్చిపోయారు.  అదే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం" అని అన్నప్పుడు దానికి సమాధానంగా గుమిగూడిన అశేష ప్రజానీకంలోంచి కేరింతలు వినిపించాయి.  ఇది జగన్ ఓదార్పు యాత్రలో జరిగిన సంఘటన.  2003లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన 1400 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన శ్రీకాకుళం లోని సన్నివేశమిది.  ఇది జరిగింది జూలై 2010లో. 

వైయస్ఆర్ ఆకస్మిక మరణంతో వేదన చెంది మృతి చెందిన కుటుంబీకులను ఓదార్చేందుకు అతని కుమారుడు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు.  అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ యాత్రలను మానుకోమని రెండుసార్లు హెచ్చరించారు.  అయినా జగన్ వినలేదు.  వినవలసిన అవసరం కూడా అతనికి లేదు.  తండ్రి మరణం తర్వాత ఆయన స్మృతిలో ఏం చేసుకుంటారన్నది జగన్ ఇష్టం.   చట్ట విరుద్ధమైన పని కానంత వరకూ, ఎవరికీ ఇబ్బంది కలగనంత వరకూ ఆ పనిలో అభ్యంతరాలు తెలపవలసిన అవసరం ఏముంటుంది.  ఎవరికి ఇబ్బంది కలుగుతోంది.  జగన్ కి ఈ యాత్రల వలన ప్రజామోదం, మద్దతు లభిస్తుందేమో అని భయపడేవారికే ఇబ్బంది కలిగించింది కానీ వేరెవరికీ కాదు.  

అందువలన రాజకీయ నేతలంతా ఏక కంఠంతో "ఫౌల్" అని అరిచారు.  జగన్ యాత్రలో పాల్గొనవద్దని కాంగ్రస్ నేతలకు రోశయ్య పిలుపునిచ్చారు. లక్ష్మణ రేఖ దాటుతున్నావ్ అని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్పి గర్జించారు. అంతకంటే ఘోరమైన విషయమేమిటంటే ఓదార్పు యాత్ర లక్ష్యాన్నే కించపరుస్తూ, ఓదార్చవలసిన కుటుంబీకులనందరినీ ఒకచోటికి పిలిచి వారికి చెయ్యదలచుకున్న ఆర్థిక సాయాన్ని ముట్టజెప్పవచ్చు గదా అని జగన్ కి సూచించారు.  రాజకీయ పొరలు కప్పినవారికి ఎవరేం చేసినా రాజకీయం లాగానే కనిపిస్తుందనటానికి ఇదే నిదర్శనం.  జగన్ తలవంచని వైఖరి పెద్దలనందరినీ కోపానికి గురిచేసింది.  కానీ వైయస్ జగన్ కి ప్రజల సానుభూతి, కొందరి రాజకీయనాయకుల, వైయస్ ఆర్ విధేయుల మద్దతు లభించటమే కాకుండా జగన్ పార్టీ పెడితే మేము దానికే మద్దతిస్తామని అన్నవారున్నారు.  అయినా ఆ సమయంలో తను చేస్తున్న ఓదార్పు యాత్రలో జగన్ ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. 

అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి.  జగన్ కొత్త పార్టీ పెట్టటం, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఉపఎన్నకల్లో అత్యధిక మెజారిటీతో గెలవటం జరిగింది. 

ఈ వైఖరి జగన్ సిబిఐ ఆరోపణలను ఎదుర్కుంటున్న సమయంలో కూడా 2011లో ఆగస్ట్ 15 నుంచి కృష్ణా జిల్లాలో చేసిన ఓదార్పు యాత్ర వరకూ అలాగే కొనసాగటం విశేషం.  ఒక పక్క నమ్ముకున్న పార్టీ, తండ్రి ఎంతో సేవ చేసిన పార్టీ తనను దూరంగా ఉంచటం, ఇతర పార్టీలన్నీఏకమై నిందించటం, మరో పక్క అసలు ఆర్థికంగా చితికిపోయేట్టుగా చేస్తే ఏ కార్యక్రమమూ ఉండదు కదా అన్న ఆలోచనలతో ఆరోపణలు చేసి చివరకు కేసులు పెట్టటం వరకూ వచ్చినా జగన్ చలించకుండా తన కార్యకలాపాలను కొనసాగించటం విశేషం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man demands his wine licence to be cancelled
Injurious smoking growing in the society  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles