రేపటి నుంచి 5 వరకూ శని ఆదివారాలు సహా జరగబోయే శాసన సభల సమావేశాల్లో ఏం జరగబోతోంది, ఎటువంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. ముఖ్యంగా పార్లమెంటులో జరుగుతున్న గందరగోళం చూస్తుంటే రాష్ట్రంలో సమావేశాలు సజావుగా సాగేనా అన్న అనుమానం వస్తోంది. కానీ కేంద్రం పరిస్థితి వేరు. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతించిన ప్రభుత్వం మీద అన్ని పార్టీలూ గుర్రుగా ఉన్నాయి. సమావేశాలు జరుగుతుండగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవలసిన అవసరం ప్రభుత్వానికేమొచ్చిందని అన్ని పార్టీల వారూ నిలదీస్తున్నారు. మరో పక్క రాష్ట్ర విభజనల బంతులు కూడా కేంద్రం కోర్టులోనే ఉన్నాయి. ఇవన్నీ కాక లోక్ పాల్ బిల్లు ఒకటి గందరగోళాన్ని సృష్టించటానికి పొంచి చూస్తోంది.
కానీ రాష్ట్రంలో అటువంటివేమీ లేవు. ఉంటే గింటే ప్రభుత్వ పథకాలను విమర్శించవచ్చు. ఈ రోజు మండలి సభల్లోనూ శాసన సభల్లోనూ జరగవలసిన అజెండా సిద్ధం చేయటానికి సభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం (బిఏసి) జరిగింది. బిఏసి లో సమావేశాలకు నిర్ణయించిన కాలం సరిపోదని అభ్యంతరాలు తెలుపుతూ, ప్రతిపక్షాలు రైతు సమస్యలు, కరువు గురించి చర్చలుండాలని కోరారు. అవిశ్వాస నోటీసు ఇస్తామని తెదేపా ప్రకటించగా, తెలంగాణా తీర్మానం ప్రవేశపెట్టాలని తెరాస పట్టుబట్టింది. తెదేపా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే మద్దతిస్తామని తెరాస తరఫున తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటమనేది తెదేపాకు అంతర్గత చర్చనీయాంశమైంది. ఒకవేళ అనుకున్న మద్దతు లభించకపోతే వీగిపోతుంది. అయితే దానివలన తెదేపా పెద్దగా నష్టపోయేదేమీ లేదు కానీ, ఒకవేళ కిరణ్ కుమార్ మీద అవిశ్వాస నిరూపణ జరిగితే పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచిస్తోంది. ఉప ఎన్నికలొస్తే ఇటు తెరాస, అటు జగన్ మద్దతుదార్లు, ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వీటి మధ్యలో తెదేపా అధికారంలోకి వచ్చేంత మెజారిటీని సంపాదించగలుగుతుందా అన్నది ప్రశ్న. ఒకవేళ ఆ పని చెయ్యలేకపోతే 2014లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా అధికారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇదే తెదేపాను వేధిస్తున్న ప్రశ్న
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more