రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన రచ్చబండ కార్య క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తోటి మంత్రులతో కలిసి సంవత్సర వేడుకలు జరుపుకొని తరువాత శాంతి కపోతాలు ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతుండగా ధరల పెరుగుదలకు నిరసనగా పది మంది మహిళలు ప్రసంగానికి అడ్డుతగిలారు. దీనికి ఆయన స్పందిస్తూ.....
తాను ఎవరికీ భయపడేది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం షాద్నగర్ రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. సిఎం మాట్లాడుతున్న సమయంలో కొందరు మహిళలు ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు కిరణ్ స్పందిస్తూ తాను ఎవరికీ భయపడనని అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. లక్ష మంది సభలో కేవలం పదిమంది వచ్చి అడ్డుకున్నంత మాత్రాన ఏదీ ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియోజకవర్గమనే తాను షాద్ నగర్లో సభ పెట్టానని చెప్పారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు జనవరి నుండి అందించేందుకు ఈ రోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి తీసుకున్నానని చెప్పారు. అవి కూడా నేరుగా వారి వారి అకౌంట్లలో పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో మూడేళ్లలో 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. చదువుకున్న యువతకు నైపుణ్యాలు కొరవడం వల్ల నిరుద్యోగులుగా మిగులుతున్నారని మరో పక్క పరిశ్రమలలో నిపుణులైన వ్యక్తులు దొరక్క ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయన్నారు.
ఈ రెండింటి మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉద్యోగాలు ఉన్న రంగాలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే కృషి జరుగుతోందన్నారు. నిత్యావసర ధరలు నియంత్రించేందుకు త్వరలోనే ఓ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలో పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి మాట నిలుపుకుంటామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more