పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చేతులు మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రీపెయిడ్ ఆటో సర్వీస్ ప్రారంభమైంది. ప్రయాణీకులు ఆటో వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా, వారు వెళ్ళాల్సిన ప్రదేశాన్నిబట్టి ముందుగా నిర్ణయించిన ప్రకారం కంప్యూటర్ ద్వారా బిల్లింగ్ జరుగుతుంది. దీనివలన సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి నగరంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుంది. ఆటోకి అధికంగా చెల్లించాల్సిన అవస్త తప్పిపోవటమే కాకుండా, బిల్లు బయటకు వచ్చే ముందు ప్రయాణీకుల వివరాలు, ఆటో వివరాలు కూడా కంప్యూటర్ ల్ పొందుపరుస్తారు కాబట్టిసామాన్లు పోవటం లాంటి ఫిర్యాదుల్లో దర్యాప్తు సులభతరం కూడా అవుతుంది.
ఈ సదుపాయాన్ని అమలులోకి తెచ్చిన నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సివి ఆనంద్ని ఈ సందర్భంగా బొత్స అభినందించారు. నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కూడా ఈ ప్రీపెయిడ్ ఆటో విదానం ప్రయాణీకులకు చాలా మేలు చేస్తుందని అన్నారు.
దీనివలన మరో ఉపయోగం కూడా ఉంది. బయటకు వచ్చే వాళ్లకి అడ్డుగా వచ్చి ఆటో కావాలా అని నిలదీసేవారుండరు. పైగా రైల్పే స్టేషన్ చుట్టు పక్కల తిరుగుతూ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే ఆటోవాలాలు, దానికంటే క్యూలో వెళ్ళి ప్రయాణీకులను పద్ధతి ప్రకారం ఎక్కించుకుని పోవటంలోనే ప్రయోజనముందని గ్రహిస్తారు. కాకపోతే రైలు దిగగానే ఇంటికెళ్ళే తొందరలో క్యూలో నిలిచి కంప్యూటర్ బిల్లింగ్ కోసం వేచివుండటానికి ఇష్టపడక పోవచ్చు. దాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఆటోవాలాలు పాత పద్ధతిలో సవారీలను తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యవచ్చు. అందువలన కొన్ని రోజుల పాటు అందరికీ అవగాహన కలిగించి ప్రోత్సహించే విదంగా ఈ సిబ్బంది కృషి చెయ్యవలసివుంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more