అవిశ్వాసానికి టీడీపీ రెడీ అవుతోంది. రైతు సమస్యలపై సర్కార్ను బలపరీక్షకు నిలిపేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు సర్కార్ను కూలదోసేందుకు కలసిరావాలంటూ ఇన్నాళ్ళు టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన పార్టీలకు సవాల్ చేస్తున్నారు. ఇంతకీ అవిశ్వాసం పెడితే నెగ్గనుందా ? వీగిపోనుందా ? రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్దమైంది. ఇదే విషయాన్ని రంగారెడ్డి జిల్లాలో రైతు పోరుబాటలో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు జారి పోకుండా చూస్తారా అని ఆ పార్టీ అధినేత జగన్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలపై శాసనసభ శీతాకాల సమావేశాలలో అవిశ్వాస తీర్మానంపై నోటీసు అందజేస్తామన్నారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసంపై స్పీకర్కు నోటీసు ఇస్తే దీనిపై చర్చ జరుపకుండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుపుకుని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు. రాష్ట్ర సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టినా ఎదుర్కోనేందుకు సిద్దంగా వున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 294 స్థానా కాంగ్రెస్ గెల్చుకున్నది 156 స్థానాలు..ఇందులో జగన్ వైపు 25 మంది వెళ్లారు. పీఆర్పీ విలినంతో ఆ పార్టీకి చెందిన 17 మంది, అలాగే ఎంఐఎం నుంచి ఏడు గురి మద్దుతు వుండనే వుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు.
ఈ నెంబర్ గేమ్లో కాంగ్రెస్ సర్కార్కు డోకాలేదని ప్రధాన నేతలు టేకిట్ ఈజీగా తీసుకుంటున్నారు. జగన్వైపు ఉంటూనే కిరణ్సర్కార్కు మద్దతిస్తామని కొందరు ఎమ్మెల్యేలు అంటుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు టీఆర్ఎస్, లోక్సత్తాలు రెడీ అవుతున్నాయి. సో ఈ గేమ్లో కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకుని సర్కార్ను కాపాడుకుంటుందా...లేక విపక్షాల మద్దతుతో ప్రభుత్వం కూలుతుందా అనే సస్పెస్కు అసెంబ్లీ సమావేశాలలో తెరపడనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more