యుపిలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించటానికి పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. రాష్ట్ర విభజనపై మాయా వేసిన పాచికకు ధీటుగా నాలుగు ప్రధాన పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. యుపిలో గ్రామీణాభివృద్ధి నిధుల గోల్మాల్పై సి.బి.ఐతో విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటిస్తే.. అవిశ్వాసం ద్వారా BSPని ఇరుకున పెట్టాలని ఎస్పీ- బీజేపీ భావిస్తున్నాయి. యుపిలో మాయావతిని చిత్తు చేయటానికి విపక్షాలన్నీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న యుపి అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్పై అవిశ్వాసతీర్మానం పెట్టాలని భావిస్తున్నాయి. చిన్న రాష్ట్రాలను ఎస్పీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీకి బిజెపి మద్దతు పలుకుతోంది. సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ యుపిని నాలుగు ముక్కలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనితో యుపి రాజకీయం రంగులు మారేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో బిఎస్పీ తరవాత రెండో అతి పెద్ద పార్టీ ఎస్పీ, బిజెపి చేతులు కలిపి అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ కు నోటీసు ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే నాలుగో పార్టీయైన కాంగ్రెస్ పరిస్ధితి అగమ్య గోచరంగా వుంది. రాహుల్ గాంధీయే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్. నెహ్రూ- గాంధీల హాయంలో యుపిలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం మిణుకు మిణుకు మంటూ వుంది. ఐతే 2009లో రాహుల్ కృషితో ఆ పార్టీ గౌరవప్రదమైన స్ధానాలు దక్కించుకుంది. కానీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ మేజిక్ పని చేస్తుందా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు భిన్నా భిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలుగా యుపిని విభజిస్తే లబ్ధిపొందేది బిఎస్పీయేనని వారి అంచనా. కేవలం మధ్య యుపిలో మాత్రమే ఎస్పీ ప్రభావం వుండేఛాన్స్ వుంది. పశ్చిమ యుపిలో బిజెపి గణనీయంగా ప్రభావం చూపవచ్చంటున్నారు. దీనితో కాంగ్రెస్ పరిస్ధితి విశ్లేషకుల అంచనాలకు అందటం లేదు. కాంగ్రెస్ పరిస్ధితి ఇంతగా దిగజారటానికి పలు కారణాలున్నాయని చెపుతున్నారు. 90 వదశకం నుంచి బిఎస్పీ, ఎస్పీ, బిజెపిలు యుపిలో రాజ్యం ఏలటంతో కాంగ్రెస్ క్యాడరను దాదాపుగా కోల్పోయింది. పైగా ఈమూడు పార్టీల వల్ల కండ బలం , ధన బలం వున్న నేతలు యుపిలో తయారయ్యారు. బిఎస్పీ సర్కార్ పై ఎన్ని ఆరోపణలు వున్నప్పటికీ 11వ పంచవర్ష ప్రణాళికలో 7.28 శాతం జాతీయాభివృద్ధి రేటు సాధించాలని నిర్ధేశించగా యుపి 6.10 శాతం సాధించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీని దెబ్బతీయాలన్న కాంగ్రెస్ ఆశలు ఫలించేలా కనిపించటం లేదు. 80 లోక్ సభ స్దానాలు వున్న యుపితో ఢిల్లీ పీఠాన్ని శాసించే సత్తా వుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఆ రాష్ట్రంలో పాగాకు ప్రతి పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. 80 సీట్లలో మెజార్టీ స్ధానాలు దక్కించుకున్న వారే భవిష్యత్ దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా నిలవనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more