ప్రపంచం లోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి,అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. దివంగత సిరిమావో బండారు నాయకే. శ్రీలంక ఫ్రీడం పార్టీ తరఫున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఈమె శ్రీలంక దేశానికి 7వ, 9వ, 15వ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అలా ఆమె మొదటిసారి జులై21, 1960న మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజుగా జులై 21కి ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టారు.
1916 ఏప్రిల్ 17వ తేదీన ఓ బౌద్ద కుటుంబంలో సిరి మావో రతవాతే దియాస్ బండారునాయకే జన్మిం చారు. లంక రాజధాని కొలంబోలోని సెయింట్ బ్రిగేడ్స్ కాన్వెంట్లో విద్యనభ్యసించారు. ఆ తరువాత యుక్తవయస్సు వచ్చాక ఆమెకు దియస్ బండారునాయకేతో 1940వ సంవత్సరంలో వివాహం జరిగింది.బండారు నాయకే శ్రీలంక ఫ్రీడం పార్టీకి 40 సంవత్సరాల పాటు తన అవిరళ కృషి జరిపారు.1955 ప్రాంతంలో అప్పటి విపక్ష నేతగా ఆయన సింహళ భాషను అధికారభాషగా గుర్తించాలని, తాను గనక అధికారంలోకి వస్తే, 24గంటల్లోనే సింహళాన్ని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఆదేశాలిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.అన్న ట్టుగానే బండారునాయకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించటం. సింహళాన్ని అధికార భాషగా గుర్తించటం జరిగిపోయాయి. దాంతో తమిళ-సింహళ తెగల మధ్యఘర్షణలు చెలరేగి 150 మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన ఆయన కొద్దిపాటి సడలింపులు విధించినా.. ఆ తరువాత అనేక ఘర్షణలు జరిగి వందలాది తమిళులు మరణించారు.
ఆ తరువాత 1959 సెప్టెంబర్ 25న బండారునాయకే ఒక బౌద్ధ సన్యాసి చేతిలో హత్యకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో బండారునాయకే జీవన సహచారిణి సిరిమావో బండారు నాయకే 1960 జులై 21వ తేదీన శ్రీలంక ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. లంక సెనేట్కు ప్రాతినిధ్యం వహించిన ఆమె తన పరిపాలనా కాలంలో వివిధ రంగాలను జాతీ యీకరణ చేస్తూనే దేశాభివృద్ధికి విశేషంగా పాటు పడ్డారు.సిరిమావో పరిపాలన కాలంలో చేపట్టిన సంస్కరణల కారణంగా అనేక దేశాలకు శ్రీలంక దగ్గరైంది. పాలనా కాలంలో ఈమె సింహళ భాషను శ్రీలంక జాతీయ భాషగా చేశారు. అయితే ఆమె చేపట్టిన ఈ చర్య అక్కడ నివాసం ఉంటున్న తమిళులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో 1965లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ పరాజయం పాలైఅధికారం నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో శ్రీలంకలో కొత్త రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది.
తర్వాత 1970లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సిరియావో.. ప్రధాన మంత్రిగా బాధ్యతలు మరోసారి చేపట్టారు. అప్పటి వరకూ సిలోన్గా పిలిచిన లంకను శ్రీలంకగా నామకరణం చేశారు. దేశంలో అప్పుడే వేళ్లూను కుంటున్న వేర్పాటువాదాన్ని భారత, పాకిస్తాన్ దళాల సాయంతో సిరిమావో అణచివేశారు. ఆ తరువాత 1977వ సంవ త్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిరిమావో నేతృత్వం వహిస్తున్న శ్రీలంక ఫ్రీడం పార్టీ పరాజయం పాలైంది. ఆ తరువాత మళ్లీ 1944లో అధికారంలోకి వచ్చిన ఈమె ఆగస్టు 10, 2000 సంవత్సరందాకా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం అదే సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన గుండెపోటు కారణంగా సిరిమావో బండారు నాయకే తుదిశ్వాస విడిచారు..
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more