భారతదేశంలో పాశ్చాత్త సంస్కృతి ఎంతమేర వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన దేశ సంస్కృతీ సంప్రదాయాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. నేటి యువతలో కేవలం పాశ్చాత్త లక్షణాలే తప్ప.. దేశ సంస్కృతి ఏమాత్రం కనిపించడం లేదు. కానీ.. కొందరు మాత్రం అందరికి విరుద్ధంగా దేశ సంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో శొంఠి శారదాపూర్ణ ఒకరు. ఉత్తమ చదువులు అభ్యసించి రచయిత్రిగా ఎదిగిన ఈమె.. అమెరికాలో భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలను పరిరక్షించేందుకు ‘శ్రీ ఫౌండేషన్’ స్థాపించారు. స్వాతంత్రసమరయోధులైన ‘సుసర్ల గోపాలశాస్త్రి’ కుమార్తె అయిన ఈమె.. చికాగోలో తెలుగు స్టడీస్ సెంటర్ డైరక్టరుగా పనిచేస్తున్నారు.
జీవిత విశేషాలు :
శొంఠి శారదాపూర్ణ తిరుపతిలో జన్మించారు. కోస్తా ప్రాంత నగరమైన విశాఖపట్నంలో పెరిగింది. ఆమె తండ్రి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుదు, ఆజాద్ హింద్ ఫొజ్ సభ్యుడు అయిన సుసర్ల గోపాలశాస్త్రిగారు. 1975లో ఆమె అమెరికాకు వలస వెళ్ళారు. ఆమె 1997లో తెలుగుభాషలో డాక్టరేట్ పొందడంతోపాటు త్రిపురనేని గోపీచంద్ గోల్డ్ మెడల్ ను పొందారు. 2010లో సంస్కృత భాషలో రెండవ డాక్టరేటు డిగ్రీని పొందారు. భారతదేశంలోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి సంగీత శాస్త్రంలో డి.లిట్ చేశారు. ఆమె భారత దేశంలో భాష, సాహిత్యం, కళా ప్రదర్శనలపై గణనీయంగా కృషిచేసారు.
1989లో ఎటువంటి లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థ అయిన ‘సప్నా’ (అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ నార్త్ అమెరికా)ను ఆమె స్థాపించారు. అదే సంవత్సరంలో చికాగో నగరంలో ‘శ్రీ ఫొండేషన్’ను స్థాపించారు. ఈ సంస్థను అమెరికాలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించేందుకుగాను స్థాపించారు. ఆమె 2000లో ‘సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్’ను స్థాపించారు. రచయిత, పండితురాలు కూడా అయిన శారదా.. 8 పుస్తకాలను ప్రచురించారు. ‘బ్రహ్మి’ అనే త్రైమాసిక జర్నల్ కు ఆమె యజమాని, సంపాదకురాలు. ఆరు సంవత్సరాలపాటు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్, ప్రోగ్రాం కో-ఆర్దినేటరుగా పనిచేసారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more