దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన కథానాయికల్లో టీ.ఆర్.రాజకుమారి ఒకరు. మేనిమెరుపు సౌందర్యం కలిగిన ఈమె.. ఆనాడు ‘డ్రీమ్గర్ల్’గా పిలిపించుకున్న మొదటితారగా ప్రసిద్ధి గాంచింది. అందంతోపాటు తన అభినయంతో ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. తమిళనాటలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈమె.. తరువాతికాలంలో ఇతర దక్షిణ భాషల పరిశ్రమల నుంచి అవకాశాలు పొందుతూ.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
జీవిత విశేషాలు :
1922లో బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రసిడెన్స్, తంజావూరులో రాజకుమారి జన్మించింది. ఈమె పిన్ని ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి కూడా తమిళ సినీ పరిశ్రమలో నటిగా వుండటం కారణంగా రాజకుమారి సినీ ప్రస్థానం మరింత సులువుగా కొనసాగింది. ఆమె కారణంగా సినీ రంగానికి పరిచయమైన రాజకుమారి.. అనతికాలంలోనే తన ప్రతిబతో దూసుకెళ్లింది. 1941లో విడుదలైన రాజకుమారి ‘కుమార కుళోత్తుంగన్’ సినిమా ద్వారా ఈమె కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేయడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి. ఆ సినిమా తర్వాత రాజకుమారి నటించిన ‘కచదేవయాని’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆమె ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది. ‘మంత్రావతి’, ‘సూర్యపుత్రి’, ‘మనోన్మణి’ తదితర చిత్రాలు ఆమెను ఆనాటి కుర్రకారుకు కలలరాణిని చేశాయి. 1948లో రాజకుమారి కథానాయికగా నటించిన ‘చంద్రలేఖ’ చిత్రం ఆనాడు సంచలనాత్మక విజయం సాధించింది. ఆ చిత్రం అటు తమిళనాడులోనే కాక, ఆంధ్రదేశంలోనూ రజతోత్సవం జరుపుకుంది. దాంతో రెండు భాషల్లోనూ రాజకుమారి పేరు మారుమ్రోగింది.
రాజకుమారి కుటుంబమంతా సినిమా రంగానికి చెందినవారే. అక్క తమిళనటి.. అక్క కూతురు కుచలకుమారి ప్రసిద్ధ సినీ నర్తకి.. సోదరుడు టి.ఆర్.రామన్నతోపాటు మరో సోదరుడు టి.ఆర్.చక్రపాణి కూడా నిర్మాతే.. రామన్న భార్యలు బి.ఎస్.సరోజ, ఇ.వి.సరోజ ఇద్దరూ నటీమణులే.. శృంగార తారలు జ్యోతిలక్ష్మి, జయమాలిని రాజకుమారి చెల్లెలి కూతుళ్లే.
శిల్పసుందరిలా ఎంతో అందంగా వుండే రాజకుమారికి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. అయితే.. ఆమెకు తన చివరి రోజుల్లో కుష్ఠు వ్యాధి వచ్చింది. దీంతో ఎవరినీ కలవలేని పరిస్థితి. మరీ ఆత్మీయులెవరైనా వస్తే తెరచాటు నుంచి మాట్లాడేది. ఈ వ్యాధి కారణంగా ఆమె 1999 సెప్టెంబరు 20వ తేదీన మరణించింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more