ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈరోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. విశాఖ రీజియన్ (సిటీ/రూరల్) పరిధిలో 1064 బస్సులున్నాయి. రూరల్లో 352 సర్వీసుల ద్వారా రోజుకు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. పెరిగిన చార్జీలతో ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల భారం పడుతుంది. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లపై భారం పడదని అధికారులు తెలిపారు.
కొన్ని బస్పాస్లపైనా భారం మోపింది. మొత్తమ్మీద 10 శాతం చార్జీలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. పల్లె వెలుగులో 35 కి.మీ దాటితే రూ.1 పెరగ్గా, సిటీ బస్సు టికెట్లు కూడా రూ.1కి తక్కువ లేకుండా పెరగబోతున్నాయ్. ప్రయాణికుల నుంచి బస్టాండ్లు, కాంప్లెక్సుల్లో అభివృద్ధి చార్జీల పేరిట ప్రస్తుతం వసూలు చేస్తున్న సెస్ రూ.1 తోపాటు టోల్గేట్ల వసూల్లో మార్పేమీ లేదని డిప్యూటీ సీటీఎం (రూరల్) పబ్బా జీవన్ ప్రసాద్ తెలిపారు.
స్టేజీల పరిస్థితి ఇదీ : 14 కి.మీల పరిధిలో ఏడు స్టేజీల వరకు రూ.1 పెరగనుంది. 14 కి.మీ నుంచి 40 కి.మీ వరకు రూ.2 పెంచనున్నారు. సిటీ మెట్రోపై ప్రతి స్టేజీకి రూ.1 వడ్డన పడనుంది. కనీస టికెట్ రూ.6 నుంచి రూ.7కి పెరగనుంది. సిటీ పరిధిలోని తొమ్మిది డిపోల పరిధిలో సుమారు 400 సర్వీసులున్నాయి. బస్పాస్లపైనా భారం పడనుంది.
విద్యార్థుల పాస్లపై దృష్టి సారించినప్పటికీ ఆర్డినరీ పాస్ తీసుకుని ఎక్స్ప్రెస్/మెట్రో బస్సులెక్కేవారిపై (కాంబి టికెట్) ఇప్పుడున్న రూ.5 అదనపు ధర రూ.10కి పెరగనుంది. జనరల్ బస్ టికెట్ (జీబీటీ) పాస్ రూ.650ది ఇకపై రూ.700కానుంది. మెట్రో పాస్ రూ.750ది ఇకపై రూ.800 కానుంది. సిటీ బసుల్లో పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ గతంలో రూ.60 ఉండగా ఇప్పుడది రూ.70 అవుతుంది. ఎన్జీవో పాస్లు గతంలో రూ.220 ఉండగా ఇప్పుడు రూ.235, మెట్రోల్లో రూ.320ది కాస్త రూ. 335కానుంది.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more