Tammineni veerabhadram comment on samaikyandhra movement

tammineni veerabhadram comment on samaikyandhra movement, tammineni veerabhadram, cpm leader tammineni veerabhadram, GITAM University,

tammineni veerabhadram comment on samaikyandhra movement

ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలు-అంతర్జాతీయ స్థాయిలో 'గీతం'

Posted: 08/20/2013 09:15 AM IST
Tammineni veerabhadram comment on samaikyandhra movement

 సమైక్యం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న పార్టీలను ఎండగట్టాలని మాజీ ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన 'భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన - సమస్యలు - ఉద్యమాలు' సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుజాతిని చీల్చి రాజకీయ ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, అంగీకారం తెలిపిన వైసీపీలకు చెందిన సీమాంధ్ర నాయ కులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన నిర్ణయాన్ని మార్చుకొనేలా వీరు ఆయా పార్టీల నాయకత్వంపై ఒత్తిడి తేవాలని లేదా ఆ పార్టీలకు రాజీనామాలు చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణలో జై తెలంగాణ అంటూ కోస్తా, రాయలసీమలో సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారన్నారు.

 

'గీతం'

 

గీతం వర్సిటీలోని మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని పపువాన్యూగినియా వర్సిటి బృందం ప్రశంసించింది. ప్రపంచంలోని విశిష్టమైన దేశాల్లో ఒకటిగా పేర్కొనే పపువా న్యూగినియాకి చెందిన పపువాన్యూగినియా విశ్వవిద్యాలయం అధికారిక బృందం గీతం విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. గీతం వీసీ ప్రొఫెసర్ జి.సుబ్రహ్మణ్యంతో సమావేశమైంది. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న విశ్వవిద్యాలయాలోల గీతం ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. సమీప భవిష్యత్తులో కన్సల్టెన్సీ, పరిశోధనా ఫలితాలపై వచ్చే రాయల్టీ ఆధారంగా కోర్సుల ఫీజును తగ్గించే యోచనలో ఉన్నామన్నారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరుల్లో గీతం క్యాంపస్‌లను అనుసంధానం చేస్తూ ఈ-గ్రంథాలు, నిపుణుల వినియోగం వంటివి చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్‌తో పాటు ఫార్మశీ, సైన్స్, అంతర్జాతీయ వాణిజ్యం, న్యాయవిద్య, ఆర్కిటెక్చర్, దంతవైద్య విద్య వంటివి అందిస్తున్నామని వీసీ వెల్లడించారు. దేశంలోని ప్రముఖ కంపెనీలతో గల అవగాహనా ఒప్పందాలతో సిలబస్‌లో కాలానుగుణంగా మార్పులు చేస్తున్నామన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more