Fee reimbursement for college students

fee reimbursement, students, college students fee, andhra pradesh government, ap govt, tution fee, colleges, college administration, pvt colleges, for college students

fee reimbursement for college students

9.gif

Posted: 11/24/2012 02:52 PM IST
Fee reimbursement for college students

students_sml

ఫీజు రీయింబర్స్‌మెంటు దరఖాస్తుల రిజ్రిస్టేషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువు నవంబర్ 20తేదీ మంగళవారంతో ముగియగా, వివిధ కారణాల వల్ల నాలుగో వంతు మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది.
    ఈ ఏడాది కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల ఆన్‌లైన్ రిజ్రిస్టేషన్ మందకొడిగా సాగుతున్నది. ఇంటర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివే కొత్త విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంటుకు గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఆన్‌లైన రిజ్రిస్టేషన్‌కు ఈ నెల 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.
       విశాఖ జిల్లా మొత్తం మీద 550 విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 50 నుంచి 60 వేల మంది వున్నట్టు అంచనా. వీరంతా ఫీజు రీయింబర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ గడువు ముగిసేనాటికి 12వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు జెరాక్స్ కాపీని జత చేయాలన్న నిబంధన వుండడంతో పలువురు విద్యార్థులు దరఖాస్తు చేయలేదు. ఆయా విద్యార్థుల కుటుంబాల్లో చాలా మంది రేషన్ కార్డులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఈ నిబంధనను సడలించింది.
       ఇంటర్ పూర్తి చేసి ఐటీఐలో, ఐటీఐ చేసి ఇంటర్‌లో చేరిన విద్యార్థుల దరఖాస్తులకే కాకుండా పీజీ చేసి బీఈడీలో చేరిన వారి దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో చుక్కెదురైంది. వీటి ఆన్‌లైన్ రిజ్రిస్టేషన్‌కు సాఫ్ట్‌వేర్ సహకరించలేదు. అదే మాదిరిగా రెండేళ్ల విరామం తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఇదే అనుభవం ఎదురైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eastern navy celebrations in vizag
Police recruitement in tribal areas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more