రాజీవ్ యువ కిరణాలు పథకంలో భాగంగా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 6న జాబ్మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సి.హెచ్.సుబ్బిరెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ దరి విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిడెట్లో ఆయా ఉద్యోగాలకు ఎంపిక జరుపుతామన్నారు. 40 ఖాళీలున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు పదవ తరగతి, ఆపై విద్యార్హత, 20 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు. నెలకు రూ.5 వేల జీతం, ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, గాజువాక, నర్సీపట్నం, అనకాపల్లి, తగరపువలస, పాయకరావుపేటల్లో పని చేయాలని, స్థానికులకు ప్రాధాన్యం ఉంటుందని తెలియజేశారు. ట్రెయినీ మెకానిక్స్, మెకానిక్స్ ఉద్యోగానికి ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్మెన్ మెకానిక్ ట్రేడ్ ఉత్తీర్ణత ఉండి 18 ఏళ్ల వయసు గల వారు అర్హులని తెలిపారు. ట్రెయినీ మెకానిక్కు శిక్షణ కాలంలో నెలకు రూ.3,500తో పాటు ఇన్సెంటివ్ చెల్లిస్తారన్నారు. శిక్షణ అనంతరం పనితీరును బట్టి శాశ్వత ఉపాధి, జీతం చెల్లిస్తారని తెలిపారు.
మెకానిక్కు నెలకు రూ.6 వేల జీతంతో పాటు ఇన్సెంటివ్లు ఇస్తారన్నారు. మొత్తం ఖాళీలు 20 ఉన్నాయన్నారు. 3 ఖాళీల టింకర్ ఉద్యోగానికి ఐటీఐలో షీట్ మెటల్, వెల్డింగ్ ట్రేడ్లో అర్హత ఉండాలన్నారు. అర్హత, అనుభవాన్ని బట్టి జీతం ఉంటుందన్నారు. 5 ఖాళీల ట్రెయినీ సూపర్వైజర్ ఉద్యోగానికి డిప్లొమోలో మెకానికల్, ఆటోమోబైల్ కోర్సు పూర్తి చేసి తగిన అనుభవం ఉండాలని తెలిపారు. నెలకు రూ.7 వేల జీతం, ఇన్సెంటివ్లు ఉంటాయన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు తప్ప మిగతా వారు విశాఖలో పని చేయాలని తెలియజేశారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి బయోడేటా, ధ్రువపత్రాలు, ఎంప్లాయిమెంట్ కార్డు, రేషన్ కార్డులతో కంచరపాలెం దరి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more