Vehicular traffic halted on indrakeeladri hill in vijayawada

vehicular traffic halted on indrakeeladri hill in vijayawada, indrakeeladri hill in vijayawada, ijayawada People Suffering water streaming in Houses

vehicular traffic halted on indrakeeladri hill in vijayawada, Vijayawada People Suffering water streaming in Houses

ఇంద్రకీలాద్రిపైకి వాహనాల నిలిపివేత- బీభత్సం

Posted: 10/25/2013 04:06 PM IST
Vehicular traffic halted on indrakeeladri hill in vijayawada

విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం మీదకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే, మెట్ల మార్గం మీదుగా మాత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.

 

బీభత్సం

కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు కూలాయి. నాలుగు చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోజంతా ముసురే! 12 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి విజ యవాడ రోడ్లు చెరువులను తలపించాయి. పాతబస్తీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వించిపేట నిండా మునిగింది. కొండ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు రోడ్లమీదకు చేరింది. నైజాంగేట్ డ్రెయిన్ నుంచి మురుగునీటి పారుదలకు అవాంతరం ఏర్పడటంతో పెద్ద ఎత్తున చేరిన వర్షపు నీటితో వించిపేటను మురుగు ముంచెత్తిది. వించిపేట ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యాధరపురం బస్‌డిపో వర్షపు నీటిలో చిక్కుకు పోయింది. ఇటీవలే ఈ డిపోను పూర్తిగా కాంక్రీట్ చేశారు. బస్సు బయటకు రావాలన్నా, పోవాలన్నా దినదినగండమే అయింది. సిబ్బంది ఈ నీటిని ఈదుకుంటూనే విధులకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ డిపోలో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. సీఎన్‌జీ ప్లాంట్ నీటిలో చిక్కుకోలేదు. ఒక వేళ ఈ ప్లాంట్ నీటిలో చిక్కుకుని ఉంటే 200 ఆర్టీసీ బస్సు లు రోడ్డుమీదకు వచ్చే అవకాశమే ఉండేది కాదు. మోకాళ్ళ లోతున ఉన్న నీటిలోనే బస్సులను సీఎన్‌జీ ప్లాంట్‌కు తీసుకువెళ్ళి ఫిల్లింగ్ చేయించారు.

 

విజయవాడలో లోబ్రిడ్జి, బస్‌స్టేషన్ బ్రిడ్జి ల దగ్గర పెద్దఎత్తున నీళ్ళు నిలిచాయి. పీఎన్‌బీఎస్‌కు బస్సులు రావటం జాప్యం అయింది. కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో లోబ్రిడ్జి దగ్గర నీళ్ళు నిలిచిపోవటంతో ట్రాఫిక్ స్తంభిం చింది. సిదార్థ సెంటర్ మురుగునీటి తటాకంగా మారింది. మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించకపోవటంతో సిద్ధార్థ సెంటర్‌తో పాటు, అ న్ని అంతర్గత రోడ్లపై మురుగు, వర్షపు నీరు ముంచెత్తింది. ఐదవ నెంబర్ రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. పటమట స్కావెంజర్స్ కాలనీలో ఇళ్ళలోకి నీళ్ళు చేరాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

 

విజయవాడలో రోడ్లు అసలే అధ్వానంగా ఉన్నాయి. అన్నీ గోతుల మయం. దీనికి తోడు అభివృద్ధి పనులకు తీసిన గోతులు ఉండనే ఉన్నాయి. కూలిన వృక్షాలు ఈదురుగాలుల కారణంగా విజయవాడలో పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. చిట్టినగర్ సొరంగం మార్గంలో కొండచరియలు బలహీన పడటంతో చెట్టు కూలిపోయింది. సొరంగ మార్గంలో పడటంతో కాసేపు ట్రాఫిక్ స్థంబించింది. ఆ తర్వాత దానిని తొలగించారు. సీతారామపురం, నెహ్రూనగర్‌లలో చెట్టు నేలకూలాయి. మల్లిఖార్జున పేటలో రెండు చోట్ల, క్రీస్తురాజపురంలో కొండ చరియలు విరిగి ఇంటి పిట్టగోడ మీద పడ్డాయి. మూడు రోజులుగా మునిసిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో విజయవాడలో 1000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకు పోయి ఉంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more