రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు ఈ రోజు ఉదయం నగరంలోని మూడు జాతీయ రహదారులను దిగ్బంధించారు. విజయవాడ-హైదరాబాద్, కోల్కత్తా-చెన్నై, విజయవాడ-మచలీపట్నం రహదారులను ఎన్జీవోలు దిగ్బంధించారు. కనకదుర్గమ్మ వారధి, బెంజ్సర్కిల్, గొల్లపూడి బైపాస్, రామవరప్పాడు రింగ్ వద్ద హైవేలను ఎన్జీవోలు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రహదారులను దిగ్బంధనం జరుగనుంది. దీంతో హైవేలపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వాదుల అండ
జిల్లా వ్యాప్తంగా న్యాయవాదుల సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరిస్తూ నిరసన తెలిపిన వారు ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ది బెజవాడ బార్ అసోషియేషన్ ఆద్వర్యంలో న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు భారీ ప్రదర్శన చేసి, ప్రధాన కూడళ్లలో మానవహారంనిర్వహించారు. విజయవాడ రైల్వే కోర్టు న్యాయవాదులు కూడా విధులు బహిష్కరించారు. మచిలీపట్నం జిల్లా కోర్టుల ప్రాంగణంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులుకోర్టు ఎదుట ధర్నా చేపట్టారు. జై సమైక్యాంద్ర అంటూ ఎగురతున్న మచిలీపట్నంలో జిల్లా కోర్టు ఉద్యోగి. విజయవాడ సమరనాదం మార్మోగుతోంది. సమైక్యవాదం మిన్నంటుతోంది. ఉద్యమ జ్వాలాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.ఎక్కడికక్కడే జనమంతా ఒక్కటై విభజనకు వ్యతిరేకంగా పోరు బాట పడుతున్నారు. రోజుకో తరహాలో ఆందోళనలు కొనసాగిస్తూ, నిరసనలతో హోరెత్తిస్తూ సమైక్య రాష్ట్ర ఆకాంక్షను వినిపిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు చేపడుతున్న నిరవదిక సమ్మెకు మద్దతుగా వూరువాడా అంతా ఉద్యమంలో చేరి కదం తొక్కుతున్నారు. వరుసుగా 19వ రోజు కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more