Vijayawada rail station

7.1.png

Posted: 03/13/2012 08:53 PM IST
Vijayawada rail station

Vijayawada_Rail_station

ఆదాయంలో అగ్రగామిగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో వెనకబాటు తనమే కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలను, ఉత్తరాది రాష్ట్రాలను కలిపే అతిపెద్ద జంక్షన్‌గా రైల్వేమ్యాప్‌లో విజయవాడకు ప్రాధాన్యత వుంది. ఒక విధంగా గేట్ వే ఆఫ్ సౌత్‌గా చెప్పవచ్చు. ఆదాయంలో కూడా దాదాపు సికిందరాబాద్ డివిజన్ తర్వాత అత్యధికంగా రూ.150కోట్లకు పైగా ఆర్జించి గ్రేడ్ 1 స్టేషన్ హోదా పొందింది. రైల్వేస్టేషన్ సౌకర్యాలలో మాత్రం వెనకబాటు తనమే కనపిస్తోంది. దీని కంటే చిన్న స్టేషన్‌లు ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ అభివృద్ధి కనిపించడంలేదు. విజయవాడ స్టేషన్ నుంచి మొదలయ్యే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కేవలం నాలుగే ఉన్నాయంటే పాలకలకు ఈ స్టేషన్‌పై ఎంత మమకారం ఉందో అర్ధమవుతుంది.

దాదాపు 20ఏళ్ళ కిత్రం విజయవాడకు మంజూరైన విజయవాడ-చెన్నై పినాకినీ ఎక్స్‌ప్రెస్, విశాఖకు రత్నాచల్, హైదరాబాద్‌కు శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడుపుతున్నారు. 2001లో విజయవాడ నుంచి చెన్నైకు జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ మినహా తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే రైళ్ళేమిలేవు.దీంతో ఇక్కడ ప్రయాణీకులు దూరప్రాంతాలకు వెళ్ళాంటే అగచాట్లు పడుతున్నారు. ఒకప్పుడు విజయవాడ నుంచి వెళ్ళే జన్మభూమిని ఆ తర్వాత తెనాలి, గుంటూరు, సికింద్రాబాద్ నుంచి నడుపుతున్నారు. విజయవాడ నుంచి బయలుదేరే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎంతో ఉపయోగంగా ఉండేది. తర్వాత కాకినాడ, ఆ తర్వాత విశాఖపట్నం వరకు పొడిగించడంతో ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయాణికుల కోటా తగ్గి ఇబ్బందుకు గురవుతున్నారు. విజయవాడకు బెర్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో డిమాండ్ వున్నా ప్రయాణికులు వాటిని పొందలేకపోతున్నారు.

న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళే దురంతో ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్‌లో 20 నిముషాలు ఆగుతున్నప్పటికీ దానిలో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి లేకపోవడం బాధాకరం. ఎంతోకాలంగా ఇక్కడి ప్రయాణికులు ఎదురుచూస్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ టూ షిర్డీ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-హైదరాబాద్ రాత్రిపూట వెళ్ళేందుకు రైళ్ళు ఇపస్పటివరకు కార్యరూపం దాల్చలేదు.పేరుకు మాత్రమే ఎ గ్రేడ్ హోదా వున్న విజయవాడ స్టేషన్ సౌకర్యాల విషయం చూసుకుంటే బి గ్రేడ్ స్టేషన్‌లో ఉన్న సదుపాయాలు కూడా లేవు. ఉపేంద్ర హయాంలో కష్టపడి ఒక ఎస్కలేటర్‌ను మంజూరు చేయించగలిగారు. ఆ తర్వాత ఐదు ఎస్కలేటర్లు, నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరైనప్పటికీ ఆ పనులు ఇప్పటికీ ప్రారంభంకాలేదు. 2011 మార్చి నాటికి పూర్తవుతాయని ఇచ్చిన హావీని ప్రభుత్వం నేటికీ నెరవేర్చకపోవడం గమనార్హం.

ఇక్కడకు మంజూరైన నాలుగు లిఫ్టుల్లో మూడు లిఫ్టులను పక్కనే వున్న చీరాల, గుంటూరు, రాజమండ్రి ఎంపీలు తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఇంత జరిగినా ఈ వ్యవహారంలో విజయవాడ ఎంపి నోరు మెదపకపోవడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తానంటూ హామీలు ఇచ్చి, తర్వాత పట్టించుకోకపోవడం లగడపాటికి అలవాటు అయిపోయిందని వారు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Durga temple revenue
Dr samarams permanent health exhibition in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more