జనన మరణ వివరాలతోపాటు, ఓటరు, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్రాల్లో సాంకేతిక కారణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యం వెరశి సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్ల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 25 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా రూరల్ పరిధిలో మరో 130 వరకు ఉన్నాయి. మీ సేవ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 1000 వరకు పలు రకాల పత్రాలు జారీ చేస్తుంటే మరో 2 వేల మందికిపైగా తిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. చలానా చెల్లించిన వారంలో వారు కోరిన గుర్తింపు పత్రాలు అందజేయాలి. అయితే పలు కారణాల చేత 12 నుంచి 20 రోజులు పడుతోంది. ప్రధానంగా జనన,మరణ ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అర్జీదారులకు తిప్పలు తప్పటం లేదు. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నా, ఉపకార వేతనాలు పొందాలన్నా జనన ధృవీకరణ పత్రం తప్పని సరి. వీటి కోసం దరఖాస్తుదారులు తిరుపతి కార్పొరేషన్, మీ సేవా కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, అవగాహనా లోపం దరఖాస్తు దారులకు శాపంలా మారింది. మనిషి పుట్టినప్పుడు, మరణించినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకు నిర్దిష్ట గడువు విధించింది. ఇంటివద్ద పురుడుపోసుకున్నా.. మరణించినా కార్పొరేషన్, మున్సిపాలిటీ లేదా పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే ఆస్పత్రిలో జరిగితే వైద్య సిబ్బంది అధికారులకు రిపోర్ట్ పంపుతారు. ఏడాదిలోపైతే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తరువాత నుంచి 15 ఏళ్ల వరకైతే రూ.5 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. ఆపైన చేసుకోవటానికి వీల్లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more