పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడవీథులలోని ప్రధాన గోపురానికి కుడివైపున్న మఠం ఆ భక్తుడు బావాజీదే! ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం వుంటుంది. ఈ మఠాన్ని హాథీరాం మఠం అంటారు.
కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు. అక్కడ శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం, అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు... ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. శ్రీనివాసుని దర్శనభాగ్యం కోసం చిన్నపిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తూ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. `నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం! నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటాన`ని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత, ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు.అక్కడ వారిద్దరూ పొద్దుపొడిచేవరకూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలూ ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది.
అలా ఒకసారి... బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సుప్రభాతవేళ సమీపించింది... జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వేంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బావాజి మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం మూలవిరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు, ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకి ప్రవేశించగా... అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. ఆ ఆభరణాన్ని ఎందుకు, ఎలా దొంగలించావని ప్రశ్నించగా.. తానేమీ దాన్ని దొంగలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తూ శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని, అర్చకులు రావడంతో హడావుడి ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోని మర్చిపోయాడని వివరించాడు. కానీ.. ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు.
‘నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చిన మాట నిజమే అయితే.. నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి’ అని నవాబు అతనికి పరీక్ష పెడతాడు. ఆరోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు, బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలివాళ్లు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకూ బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనకు ‘హాథీరాం బావాజీ’ అన్న పేరు స్థిరపడిపోయింది. హాథీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more
Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more
Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more
Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more
Jul 03 | రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి. పూర్వం వాలి,... Read more