కథ :
పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు.
అయితే ఒకరోజు వీరిద్దరూ కలిసి ‘‘విష్ణు విదియల నోము’’ను నిర్వహించుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. దాంతో రాజు కూతురు ఎంతో భక్తిశ్రద్ధలతో, నోముకు ఎటువంటి లోటు రానీయకుండా నిర్వర్తించి, ఉద్యాపనం చేసింది. తత్ఫలితంగా ఆమెకు అష్ట ఐశ్వర్యాలతోపాటు మంచి గుణవంతుడైన వరుడితో వివాహం కుదురుతుంది.
అదే మరోవైపు బ్రాహ్మణ కుమార్తె తమది విద్వత్ (విద్యాసంబంధం) కుటుంబమనే అహంకారంతో వ్రతాన్ని నిర్లక్ష్యంగా ఆచరించడమే కాకుండా.. మధ్యలోనే నిలిపివేస్తుంది. దాంతో ఆమెకు ఎక్కడలేని దరిద్ర్యం అంతా అంటుకుంటుంది. ఆమెతో ఎవరూ మాట్లాడేవారు కాదు. ప్రతిఒక్కరు ఆమెను అవమానించేవారు. ఎవరూ ఆమెతో స్నేహంగా వుండేవారు కాదు.
దాంతో ఆమె దౌర్భాగ్యాన్ని చింతి, నలుగురిలో తలెత్తుకోలేక సమీపంలోనే వున్న అరణ్యాలకు వెళ్లిపోతుంది. అక్కడే తన జీవితం గురించి శోకిస్తూ కాలాన్ని గడుపుతుండేది. ఒకరోజు లోకసంచారం కోసం వచ్చిన పార్వతీపరమేశ్వరులు.. అరణ్యంలో పడివున్న ఆ బ్రాహ్మణ కుమార్తెను చూస్తారు.
పార్వతీపరమేశ్వరులు ఆమె దగ్గరకు వెళతారు. ఆమె గురించి తెలుసుకుని, ఆమెను ఓదార్చుతూ.. ‘‘నువ్వు విష్ణు విదియల నోము’’ పట్టి మధ్యలోనే ఉల్లంఘించడం వల్ల నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి ఆ నోమును భక్తిశ్రద్ధలతో యథావిధిగా నిర్వహించుకుంటే.. నీ కష్టాలన్నీ తీరిపోయి.. సిరిసంపదలు వస్తాయి’’ అని చెప్పి అదృశ్యమవుతారు.
ఆ బ్రాహ్మణ కుమార్తె తన తప్పును తెలుసుకుని, పార్వతీపరమేశ్వరులు చెప్పిన విధంగా ఇంటికి చేరుకుంటుంది. భక్తిశ్రద్ధలతో ‘‘విష్ణు విదియల నోము’’ను నిర్వహించి, ఉద్యాపనం చేసుకుంటుంది. దాంతో ఆమె దారిద్ర్యాలు మొత్తం తొలగిపోయి తను కూడా రాకుమార్తెలాగా భోగభాగ్యాలతో జీవితాన్ని కొనసాగించింది.
విధానం :
శివరాత్రి రోజు వెళ్లగానే వచ్చే ఫాల్గుణ శుద్ధ విదియ రోజు నుంచి మొదలుకుని.. మళ్లీ శివరాత్రి వచ్చేదాకా ఈ నోమును పాటించాలి. ప్రతి విదియనాడు ఉదయాన్నే లేచి స్నానమాచరించుకోవాలి. రోజంతా మౌనవ్రతం పాటించి, శివపార్వతుల్ని పూజించుకోవాలి. పరమాన్నం, పెరుగు, అరటిపళ్లను శివపార్వతులకు నివేదించి, ఆ ప్రసాదాన్ని భుజించుకోవాలి. రాత్రి భోజనం చేయకుండా వుండాలి. కటిక నేలమీద పడుకోవాలి. ఇలా ఏడాదివరకు చేశాక ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపనం :
మొదటగా కిలోంబావు పసుపు కట్టి, దానిని 13 వెదురు పెట్టెలలో సర్దుకోవాలి. ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క లక్కజోడు, ఒక నల్లపూసల కోవ, ఒక కుంకుమ పొట్లం, కొత్త రవికెలగుడ్డ, రెండు అరటిపళ్లు, దక్షిన తాంబూలాలు చొప్పున అమర్చుకోవాలి. వాటిని లక్ష్మీనారాయణుల పూజల వుంచి.. అనంతరం వాటిలో ఒక పెట్టెను తమ దగ్గరే వుంచుకోవాలి. మిగతా 12 పెట్టెలను 12 ముత్తయిదువులకు వాయనదానమివ్వాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more
Apr 15 | పురాణ కథ : పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. బ్రాహ్మణ ఇల్లాలికి నలుగురు తమ్ముళ్లు వుండేవారు. అయితే తమ్ముళ్ల పెళ్లి వచ్చేసరికి ఆ... Read more