పురాణ కథ :
పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. బ్రాహ్మణ ఇల్లాలికి నలుగురు తమ్ముళ్లు వుండేవారు. అయితే తమ్ముళ్ల పెళ్లి వచ్చేసరికి ఆ బ్రాహ్మన ఇల్లాలి భర్తకు ఏదో ఒక వ్యాధి తీవ్రతరంగా వచ్చేది. ఎంత తీవ్రంగా అంటే.. ఏకంగా అతని ప్రాణాలకే ప్రమాదంగా మారపోయేది. ఇలా ఈ విధంగా ఆమె తమ్ముళ్ల పెళ్లి వచ్చే ప్రతిసారి ఆమె భర్త ఏదో ఒక రోగంతో పడిపోయేవాడు. దాంతో ఆమె ముగ్గురు తమ్ముళ్ల పెళ్లిళ్లకు హాజరుకాలేకపోయింది.
కొన్నాళ్ల తరువాత ఆ బ్రాహ్మణ ఇల్లాలి చివరి తమ్ముడు పెళ్లి కూడా వారింటివాళ్లు నిశ్చయిస్తారు. చిన్న తమ్ముని పెళ్లి దగ్గర కావస్తుండడంతో ఆమె బయలుదేరడానికి అన్ని విధాలుగా తయారుచేసుకుని సిద్ధంగా వుంటుంది. కానీ ఆమె భర్త మాత్రం మునుపటిలాగానే ఈసారి కూడా తీవ్రమైన వ్యాధికి గురవుతాడు. అతనికి చూడడానికి కూడా వీలుగా వుండేది కాదు. అయితే కనీసం తన చివరి తమ్ముని పెళ్లికి ఎలాగైనా హాజరుకావాలనే పట్టుదలతో వుంటుంది.
దాంతో ఆ బ్రాహ్మణ ఇల్లాలు తన రోగిష్టి భర్తను ఒక చాపలో చుట్టేసి, ఇంట్లో వున్న ఒక గదిలో మూలపడేసి, ఆ గది తలుపులు మూసేసింది. తమ్ముని పెళ్లికోసం శుభ్రంగా తయారు అయి, మంచి వస్త్రాలను ధరించి, కొన్ని కానుకలను తీసుకుని బయలుదేరుతుంది. ఎవరికీ అనుమానం రాకూడదని వెళుతూ తన ఇంటికి తాళం వేసి వెళుతుంది.
ఆ విధంగా భర్తను వదిలేసి బయలుదేరిన ఆమె దారిపోడుగునా భర్తను తిట్టుకుంటూ వెళుతుంటుంది. అలా వెళుతుండగా దారిలో ఒక చెరువుగట్టున చెట్టు నుంచి విష్ణుక్రాంత పుష్పాలు రాలిపడుతుండగా.. ఆమె వాటిని గమనించకుండా తొక్కుకుంటూ వెళుతుంది. అప్పుడు ఆ పూలు నవ్వి.. ‘‘కట్టుకున్న మొగుడు బ్రతికుండగానే, శవంలా మూటగట్టి మూలపడేసిన దానికి ‘నోము’ పూల మహిమ ఎలా తెలుస్తుంది?’’ అని చెప్పుకుంటుంటాయి. అలాగే పక్కన చెరువులో వున్న చెంగలువలతో కూడా ఈ విష్ణుక్రాంత పూలు ‘‘చూశారా’’ అని ఆమె గురించి చెబుతుంటాయి.
అయితే ఆ బ్రాహ్మణ ఇల్లాలికి ఈ పూలు మాట్లాడుకుంటున్న మాటలు తన చెవికి వినిపించినప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకుండా తమ్ముడి పెళ్లి ఆరాటంలో ఆగకుండా వెళ్లిపోతుంది. తీరా ఈమె పందిరంలో అడుగు పెట్టగానే.. పెళ్లివారి మధ్య గొడవలు మొదలవుతాయి. రేగి పీటల మీదే పెళ్లి ఆగిపోతుంది. దీంతో చుట్టుపక్కల వున్నవారు... ‘‘ఈవిడగారు దర్శనం ఇవ్వగానే పెళ్లి పీటల మీద ఆగిపోయింది. ఈమె రాకపోతేనే బాగుండేది. ఇంతకుముందు మూడు పెళ్లిళ్లు సక్రమంగానే జరిగాయి. కానీ ఈ పెళ్లికి ఈమె అడుగుపెట్టిందో లేదో.. వెంటనే చెడిపోయింది’’ అని నానామాటలు అంటుంటారు.
ఈ మాటలు విన్న బ్రాహ్మణ ఇల్లాలు తీవ్ర మనస్తాపంతో, దు:ఖంతో తన ఇంటిదారి పడుతుంది. మార్గమధ్యంలో చెరువు దగ్గరికి చేరుకోగానే.. ఇంతకుముందు పుష్పాలు మాట్లాడుకున్న మాటలు ఆమెకు గుర్తుకువస్తాయి. అప్పుడు ఆమె ఆ పుష్పాలను మునుపటి మాటలకు సంబంధించిన అర్థాన్ని వివరించండి అని అడిగితే.. విష్ణుక్రాంత నవ్వి.. ‘‘చెప్పినప్పుడు వినకుండా పోయి, ఇప్పుడు అడిగితే ఎలా?’’ అని తిరస్కరిస్తాయి. అయితే ఆమె మరీమరీ బ్రతిమిలాడి, వారిని ప్రార్థిస్తుంది.
విష్ణుక్రాంత ఆమె మీ జాలిపడి.. ‘‘ఇదిగో అమ్మాయి! తప్పంతా నీది పెట్టుకుని, నీ భర్తను తిట్టడం మంచిది కాదు. అలా చేయడంతో నువ్వు ఇంకా పాపాల మూట కట్టుకుంటున్నావు. గతంలో నువ్వు విష్ణుక్రాంత నోము పట్టి, మధ్యలోనే వదిలేసినందుకు నీ భర్త అనారోగ్యానికి గురవుతున్నాడు. అలాగే నువ్వు నీ ముగ్గురు తమ్ముళ్ల పెళ్లిళ్లకు వెళ్లలేకపోవడం... చివరి తమ్ముడి పెళ్లికి పోయినా అవమానాల పాలవడం జరిగింది. ఇప్పుడైనా ఇంటికి వెళ్లి.. మళ్లీ ఆ నోమును నిర్వహించుకుని, ఉద్యాపన చేసుకుంటే అన్నీ చక్కబడుతాయి’’ అని వివరిస్తాయి.
అది విన్న ఆ బ్రాహ్మణ ఇల్లాలు వెంటనే ఇంటికి చేరుకుని, విష్ణుక్రాంత నోముని నోచుకుని, ఉద్యాపనం చేసుకుంది. దాంతో ఆమె భర్త అనారోగ్యం నుంచి విముక్తి పొంది ఆరోగ్యవంతంగా మారిపోయాడు. అలాగే ఆమె తమ్ముడికి మంచి సంబంధం కుదిరింది. అతని పెళ్లి బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ కలిసి వెళ్లి.. బంధువులతో సంతోషంగా గడిపారు.
విధానం :
ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలను ముగించుకోవాలి. తరువాత తలస్నానం ఆచరించి, విష్ణుక్రాంతను నమస్కరించుకోవాలి. ఆ విష్ణుక్రాంత పుష్పాలను తెచ్చుకుని, విష్ణువును పూజించుకోవాలి. అలాగే పైన చెప్పిన కథను చెప్పుకుని, అక్షతలు వేసుకోవాలి.
ఉద్యాపనం :
ఈ నోమును నిర్వహించుకున్న ఏడాది తరువాత 13 జతల నేతిగారెలను విష్ణుక్రాంతకు నివేదించుకోవాలి. మరో 13 జతల నేతిగారెలను దక్షిన తాంబూలాలతో ముత్తయిదువులకు వాయన, దానమివ్వాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more