పూర్వకాలంలో రాజులుకాని, రాణులుకాని తమతమ కార్యాలలో ఫలితం దక్కించుకోవడానికి అనేక రకాల నోములు, వ్రతాలూ చేసుకునేవారు, లేదా పండితులతో చేయించుకునేవారు. వీరేకాదు.. చాలామంది పండితులు, పురోహితులు కూడా రకరకాల నోములను నిర్వహించుకునేవారు.
కొందరు జీవితాంతం సుఖంగా బ్రతకాలని, కొందరు దాంపత్య జీవితంలో కష్టాలు రాకూడదని, కొంతరు సంతానం కోసం, మరికొందరు పాపాలను తుడుచుకోవడం కోసం రకరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకునేవారు. అటువంటి నోములలో కూడా ఈ రేగులనోము ప్రత్యేకమైంది.
కథ :
పూర్వం ఒక మహారాణి.. తనకు సంతాపం కలగడం నెపంతో ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకునేది. ప్రతి ఒక దేవుణ్ణి భక్తితో ఆరాధించుకునేది. కానీ ఆమెకు ఎటువంటి ఫలితం దక్కేది కాదు. ఇతరుల పిల్లలను చూసినప్పుడల్లా ఎంతో ఆవేదనకు గురి అయ్యేది. అలా ఆవేదనలో ఆమె ప్రతిరోజూ... ‘‘నేను ఎన్నో వ్రతాలు, నోములను నోచించినా.. ఆ ఆదినారాయణుడికి నామీద దయ కలగడం లేదు’’ అంటూ వుండేది.
దీంతో ఆదినారాయణుడు ఈమె ఆవేదనను, మాటలను విని విని విసిగిపోయి ఒకనాడు రాత్రి ఆమె కలలోకి వచ్చి ఈ విధంగా అన్నాడు... ‘‘ఓ మహారాణి! నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. నువ్వు ఎన్నోరకాల నోములను, వ్రతాలను నిర్వహించుకున్నావు. కానీ నువ్వు పట్టిన రేగుల గౌరీ నోము మధ్యలోనే నిలిపివేయడం వల్ల నీకు సంతానం కలగడం లేదు. అంతేకాకుండా ప్రతిసారి నన్ను నువ్వు తిట్టుకోవడంతో పాపాలను కొనితెచ్చుకుంటున్నావు. కాబట్టి నన్ను ఆడిపోసుకోవడం మాని.. వెంటనే ఆ రేగుల గౌరీ వ్రతాన్ని పట్టి.. విధివిధానంగా పూర్తి చేసుకో. దాంతో నీకు సంతానం కలుగుతుంది’’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.
అప్పుడు వెంటనే మహారాణి మెలుకువలోకి వచ్చి తన తప్పిదాన్ని తెలుసుకుంటుంది. ఆ మరుసటిరోజే మహారాజుకు జరిగిన సంగతి మొత్తం వివరించింది. తర్వాత ఆమె మహారాజుతో అనుమతి పొంది ఈ రేగులగౌరీ నోమును ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటుంది.
అలా పూర్తిచేసి ఉద్యాపనం జరిగిన సంవత్సరంలోనే ఆమె గర్భవతి అయి పండంటి బిడ్డను కంటుంది.
విధానం :
ఏదైనా ఒక పవిత్రమైన రోజును ముందుగానే పసిగట్టి ఈ నోముకు కావలసిన అవసరాలన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నోము నోచుకున్న రోజు సద్గుణాలతో కలిగిన ఒక బ్రాహ్మణునికి తొమ్మిది గిద్దిల రేగిపండ్లు, ఒక కొత్త పంచ, దక్షిణ తాంబులాలతో సమర్పించుకోవాలి. ఇలా సమర్పించిన తరువాత ఒక సంవత్సరంపాటు పైన చెప్పిన కథను ప్రతిరోజు గుర్తుచేసుకుని అక్షతలు వేసుకుంటూ వుండాలి.
ఉద్యాపనం :
ఒక సరికొత్త వెదురు గంపలో, తొమ్మిది తవ్వల రేగిపండ్లు పోసి, వాటిలో తొమ్మిది ప్రమాణాల బంగారవు రేగి పండు వేసి, ఆపైన కొత్త పంచలచావు తాంబూలం, దక్షిణ వుంచి ఒక పేదవాడికి దాన మివ్వాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more