The Historical Story Of Draksharamam Bheemeshwara Temple | Lord Shiva Temples | Telugu Mythological Stories

Draksharamam bheemeshwara temple history lord shiva mythological stories

draksharamam temple, bheemeshwara temple history, draksharamam temple mythological story, lord shiva temple, lord shiva mythological stories, lord shiva special stories, Hindu Temples

Draksharamam Bheemeshwara Temple History Lord Shiva Mythological Stories : The Historical Story Of Draksharamam Bheemeshwara Temple Where Lord Shiva Served With Wife.

శివుడు స్వయంభువుగా వెలిసిన ‘భీమేశ్వరాలయం’

Posted: 09/02/2015 08:26 PM IST
Draksharamam bheemeshwara temple history lord shiva mythological stories

దేశంలో కొలువైన అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో భీమేశ్వరాలయం ఒకటి. తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన ద్రాక్షారామం గ్రామంలో వున్న ఈ ఆలయంలో శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వెలిశారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభువుగా శుద్ధ స్ఫటికాకారంలో వెలసిన 14 అడుగుల శివలింగం వుంది. ఈయన సతీమణి శ్రీ మాణిక్యంబా అమ్మవారు దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలసియుంది. ఈ క్షేత్రానికి శ్రీ లక్ష్మీనారాయణుడు క్షేత్ర పాలకుడిగా వున్నాడు.

draksharamam-temple-image01
draksharamam-temple-image02
draksharamam-temple-image03
draksharamam-temple-image04
draksharamam-temple-image05
draksharamam-temple-image06

స్థలపురాణం

పూర్వం.. ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపమునకు మెచ్చిన శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు ఆత్మలింగాన్ని వరంగా కోరగా.. శివుడు దానిని ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు.. ఆ లింగ శక్తి వల్ల దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ బాధలు భరించలేక వారంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెప్పాడు.

మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం ‘కుమార సంభవం’ జరుగగా.. ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయసాగాడు.  కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట. ఇలా భూమి మీద పడిన ఆ ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయి. అలా ఎదిగిపోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకుగాని, దర్శనానికిగాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేముడు.. అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేశారు. ఆ దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయాదేవుని పేరుతో పిలవబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : draksharamam temple  bheemeshwara temple history  Lord Shiva Temples  

Other Articles

  • Special story on tadbund hanuman temple

    స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు

    May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి.  ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more

  • Vemulawada is a paradise

    భూతల స్వర్గం... వేములవాడ

    Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more

  • Inavolu mallikarjuna swamy temple history indian hindu gods lord shiva mythology

    అత్యంత పురాతనమైన మల్లికార్జున ఆలయ విశేషాలు

    Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more

  • Somanth temple historical story lord shiva mythological backgrounds

    మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు

    Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more

  • Mattewada bhogeswara swamy temple historical story kakatiya dynasty

    మట్టెవాడలో కొలువైవున్న ‘భోగేశ్వరాలయం’ విశేషాలు

    Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more