భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ పరిపాలనాకాలంలో వారి మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని శాసనాలు తెలుపుతున్నాయి. అయ్యన్న ఈ ఆలయాన్ని నిర్మించటంవల్ల ఈ ప్రాంతం అయ్యన్నవోలుగా పిలువబడి, కాలక్రమంలో ఆ పేరు మారుతూ చివరగా అయినవోలు అయివుండవచ్చునని తెలుస్తోంది.
1077-1129 మధ్య రాజ్యపాలన చేసిన పశ్చిమ చాళుక్యరాజైన ఆరవ విక్రమాదిత్యుడికాలంనాటి శాసనంలో కూడా ఈ పట్టణమును అయ్యన్నవోలుగా పిలిచినట్లు చెప్పబడింది. అయినవోలు మల్లన్నగా పిలువబడే ఈ దేవుడు మైలారు దేవుడంటారు. కాకతీయులపాలనలో వున్న ఈ దేవుడు యుధ్ధ వీరుడు. ఒక చేతిలో ఖడ్గం, వేరొక చేతిలో త్రిశూలం, డమరుకం, తలపై కిరీటం, మూతిపై మీసంతో చొక్కా ధరించి వుండే ఈయనను ఖండేల్ రాయుడని, ఖండేల్ రావని పిలిచేవారు. ఈ దేవుణ్ణి యాదవులు, కుర్మలు, బలిజలు తమ ఇలవేల్పుగా కొలుస్తారు. యాదవుల ఆడబడుచు గొల్లకేతమ్మ, బలిజల ఆడబడుచు మేడలమ్మ ఈ స్వామి దేవేరులు. ఈయనని శివుని అవతారంగా కొలుస్తారు.
ఆలయ విశేషాలు :
ఆలయంలో దేవేరులతో వున్న మల్లికార్జున విగ్రహం ముందు లింగాకారంలో మల్లికార్జునస్వామి పూజలందుకుంటున్నాడు. ఇక్కడ లింగానికి అర్ధపానవట్టం వుంటుంది. అందువల్ల విశేషమైనదిగా పరిగణించబడుతుంది. ఈ లింగానికి ప్రతి రోజూ శైవాగమన పధ్ధతి ప్రకారం అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామివారికి బండారి అంటే పసుపు వాడతారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి చేతిలోవున్న పసుపును ఎంతో పవిత్రమైనదిగా తలుస్తారు. కాకతీయులకాలంనుంచీ మార్నేని వంశస్తులు, కుర్మలు, శైవారాధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆలయాన్ని అభివృధ్ధి చెయ్యాలనే ఆకాంక్షతో 1968లో ప్రభుత్వాధీనం చేశారు. నానాటికీ అభివృధ్ధి చెందుతున్న ఈ ఆలయానికి వచ్చే భక్తులకోసం సకల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more
Nov 03 | పూర్వం... దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే.. ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు.... Read more