Sri Saraswathi Kshetramu history which is located in Anantha Sagar | famous Hindu Temples in India

Sri saraswathi kshetramu anantha sagar famous hindu temple

Sri Saraswathi Kshetramu history, Sri Saraswathi Kshetramu anantha sagar, Sri Saraswathi Kshetramu temple, goddess saraswathi devi, saraswathi devi temples, famous hindu temples, hindu temples in india

Sri Saraswathi Kshetramu Anantha Sagar famous Hindu Temple : Sri Saraswathi Kshetramu is a famous Hindu Temple of Goddess Saraswathi located in the Ananthasagar, Chinna Kodur Mandal, Siddipet Division, Medak district of Telangana. The temple was built on Friday, May 2nd, 1980 -Roudri Year, Vaishakha month by Astakala Narasimha Rama Sharma (Astavadhani).

అనంతసాగర్ లో నెలకొన్న శ్రీ సరస్వతీ దేవీ క్షేత్ర విశేషాలు

Posted: 05/11/2015 07:17 PM IST
Sri saraswathi kshetramu anantha sagar famous hindu temple

చదువుల తల్లిగా పిలువబడే శ్రీ సరస్వతీదేవీ నెలకొన్న ప్రసిద్ధ క్షేత్రాలు దేశంలో ఎన్నో వున్నాయి. అటువంటి వాటిలో అనంతసాగర్ లో నెలకొన్న క్షేత్రం ఒకటి! ఇక్కడ చెట్లు చేమలు, కొండలు దొనెలుతోకూడిన సుందర ప్రకృతి అందరినీ కట్టిపడేస్తాయి. మెదక్ జిల్లా సిద్ధిపేట డివిజన్ లో వున్న ఈ అనంతసాగర్ గ్రామశివార్లో ఒక చిన్న కొండమీద ‘శ్రీ సరస్వతీ క్షేత్రం’ నిర్మించబడింది. ఇక్కడ సరస్వతీదేవి నుంచునివుండి, వీణా, పుస్తక, జపమాల ధరించివుంటుంది. దేవికి కుడివైపు ఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి, ఎడమవైపు దక్షిణాకాళి కొలువుతీరి వున్నారు.

ఆలయం నిర్మాణం వెనుక కథ :

ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారకులు శ్రీ అష్టకాల నరసింహరామశర్మ. ఈయన తన 16వ ఏట 41 రోజులపాటు బాసరలో సరస్వతీ దేవిని ధ్యానిస్తూ గడిపారు. అప్పుడు ధ్యానంలో ఆ దేవి దర్శనమై.. తనకొక ఆలయం నిర్మించమని ఆదేశించిందట. అయితే.. ఏ ఆసరాలేని శర్మ ఆలయం గురించి అప్పుడెక్కువ ఆలోచించలేదు. కానీ కొంతకాలం తర్వాత జీవనోపాధి సంపాదించుకోవటం మొదలుపెట్టాక ఆలయ నిర్మాణంకోసం స్థలం ఎంచుకుని.. 1980లో నిర్మాణం మొదలుపెట్టారు. పది సంవత్సరాలు శ్రమించి తన స్వార్జితంతో ఆలయ నిర్మాణం కావించారు.

విశేషాలు

ఈ ఆలయానికి సమీపంలో రాగి దొనె, పాల దొనె, చీకటి దొనె అనే పేర్లతో మూడు చిన్న చిన్న గుహలలాంటివాటిలో జలాశయాలున్నాయి. ఇదివరకు ఇవి 8 వుండేవని అంటుంటారు. ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసుకున్నారుట. 60 గజములపైనే లోతు వున్న ఈ దొనెలలో వుండే నీరు పేరుకు తగ్గ రుచిలోనే వుంటాయి. ఈ నీటిని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. రైతులు ఈ నీటిని తీసుకువెళ్ళి పంటలపై జల్లితే పంటలకు పట్టిన చీడలుపోయి చక్కని పంటలు పండుతాయని విశ్వాసంతో అలా చేస్తారు.

ఉత్సవములు

ప్రతి సంవత్సరం వసంత పంచమినాడు వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రంనుంచి మూడు రోజులపాటు దేవి త్రిరాత్రోత్సవములు జరుగుతాయి.  విజయదశమినాడు జరిగే దేవీ విజయోత్సవం, శమీపూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Saraswathi Kshetramu  famous hindu temples  

Other Articles

  • Special story on tadbund hanuman temple

    స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు

    May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి.  ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more

  • Vemulawada is a paradise

    భూతల స్వర్గం... వేములవాడ

    Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more

  • Inavolu mallikarjuna swamy temple history indian hindu gods lord shiva mythology

    అత్యంత పురాతనమైన మల్లికార్జున ఆలయ విశేషాలు

    Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more

  • Somanth temple historical story lord shiva mythological backgrounds

    మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు

    Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more

  • Mattewada bhogeswara swamy temple historical story kakatiya dynasty

    మట్టెవాడలో కొలువైవున్న ‘భోగేశ్వరాలయం’ విశేషాలు

    Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more