పురాణకథ :
పూర్వం కామాసురుడు అనే రాక్షసుడు శివుని నుంచి వరం పొందడం కోసం తీవ్రంగా తపస్సు చేయసాగాడు. దాంతో కామాసురుడి తపస్సుకు మెచ్చుకున్న శివుడు... అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా వరం పొందిన కామాసురుడు... కూడక్రాది పర్వతం మీద వున్న దేవతలను, మునులను, అక్కడున్న వారందరినీ తీవ్రంగా హింసించేవాడు.
దేవతలు, సప్తర్షులు ఇతని నుంచి విముక్తి కలిగించుకోవడం కోసం అనేకరకాలు ప్రయత్నాలు చేస్తారు. దేవతలు, కామాసురుడిని నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి... శుక్రాచార్యుడు, కామాసురుడికి వెళ్లి చెబుతాడు. అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుందన్న రహస్యాన్ని వెళ్లగక్కుతాడు.
అప్పుడు వెంటనే కామాసురుడు తనని తాను కాపాడుకోవడానికి శివునికి తిరిగి తీవ్రంగా తపస్సు చేయసాగాడు. అప్పుడు శివుడు అక్కడకు ప్రత్యక్షమై తనిని ఒక వరం కోరుకోమని చెప్పాడు.
అయితే కామాసురుడికి శివుడు వరం ఇస్తే.. అతను లోకకంటకుడు అవతాడని భావించి.. సరస్వతీదేవి అతని నోటినుంచి మాటరాకుండా అతని నాలుకపై వెల్లి కూర్చుంటుంది. దాంతో అతడు మూగవాడు అయిపోయినందువల్ల శివుడితో ఏ వరం కోరుకోలేపోతాడు. అప్పటి నుంచి అతనికి మూకాసురుడు అని పిలిచారు.
కామాసురుడిని సంహరించడానికి ‘‘కోల రుషి’’ పార్వతీదేవికి ఒక ఉపాయం ఇస్తాడు. దాంతో ఆమె దేవతలందరి శక్తులను కలిపి ఒక తీవ్రశక్తిని సృష్టించింది. ముకాసురినితో యుద్ధం చేసి సంహరించింది.
అయితే మూకాసురుడు అమ్మవారిని తన పేరు మీద మూకాంబికా దేవిగా వెలసిల్లమని కోరుకోవడంతో.. అతని కోరిక మీదకు కొల్లూరులో మూకాంబిక నామంతో పార్వతీదేవి వెలిసింది.
ఆదిశంకరాచార్యల కథ :
పూర్వం ఆదిశంకరాచార్యలు అమ్మవారి కటాక్షం కోసం కుడజాద్రి పర్వతాలపై తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్ష్యం అయ్యారు. అప్పుడు శంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని కోరుకోగా.. అందుకు ఆమె అంగీకరించింది. అతని వెనకే రావడానికి సిద్ధపడింది.
అయితే ఆమె ఒక షరతు విధించింది. ఆ షరతు ప్రకారం.. ఆదిశంకరాచార్యులు వెనక్కి తిరిగి చూడకూడదని... ఒకవేళ అలా వెనక్కి తిరిగి చూస్తే.. చూసిన స్థలంలోనే స్థిరంగా వుండిపోతానని అమ్మవారు చెబుతుంది.
శంకరాచార్యులు ఈ షరతును అంగీకరించి ముందుకు వెళుతుండగా.. అమ్మవారు కూడా ఆయన్ని అనుసరించింది. అలా వెళ్తూ వుండగా.. కొల్లూరు ప్రాంతానికి రాగానే.. దేవి కాలి శబ్దం వినిపించకపోవడంతో శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారు.
దాంతో అమ్మవారు తనకు ఇచ్చిన మాటను తప్పడంతో.. అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో... ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతోపాటు.. మూకాంబికా పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని పూర్వగాథ.
ఆలయ విశేషాలు :
కర్నాటకలో వున్న ఏడు ముక్తి క్షేత్రాల్లో ఈ కొల్లూరు ఒకటి. కర్ణాటకలోని పడమటి కొండలలో వున్న అందమైన కొండలమధ్య కొల్లూరు ప్రాంతంలో అందమైన వృక్షఫలాల మధ్య మూకాంబికా క్షేత్రం వుంది. ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంచనా. హరగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారని నిపుణులు చెప్పుకుంటున్నారు.
ఇక్కడి విశేషం ఏమిటంటే.. అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి వుండటం. ఆదిశంకరాచార్యాలువారు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించడంతో.. ఈ ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. ఆదిశంకరాచార్యులవారు అమ్మవారి కటాక్షంకోసం కుడజాద్రి పర్వతాలపై తీవ్రంగా తపస్సు చేయడంతో... అమ్మవారు ప్రత్యక్షం అయ్యారని చెప్పుకుంటున్నారు.
ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలు కూడా ఇక్కడ వున్నాయి. పూర్వం కర్నాటకను పాలించిన రాజులు అందరూ.. అమ్మవారికి విశేషమైన కానుకలను సమర్పించి, అర్చించారు.
మహారాష్ట్రనగర ప్రభువుల పాలనలో ఈ ఆలయం ఎంతో వైభవం పొందింది. అయితే ముష్కర తురుష్క పాలనలో ఇది దోపిడీకి గురయింది.
అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం కూడా వుంది. ఇది సింహద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే.. కుడివైపున వుంటుంది.
మూకాంబిక ఆలయంలో తేనెతో తయారుచేసే ‘‘పంచకడ్జాయం’’ అనే ప్రసాదాన్ని పెడతారు. దీనికి ఒక ప్రత్యేక కథ కూడా వుంది. పూర్వం అమ్మవారికి ప్రసాదం నివేదించిన తరువాత దానికి అక్కడే వున్న బావిలో వేసేవారట. ఇది చూసిన ఒక చదువురాని కేరళ నివాసి.. ప్రసాదం వేసేముందు బావిలో నీటి అడుగున దాక్కుని తిన్నాడట. దాంతో అతడు మహాపండితుడుగా మారిపొయ్యాడని అంటుంటారు.
కేరళ ప్రజలకు అమ్మవారిపై అపార విశ్వాసం వుంది. ముకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే.. పిల్లలు ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగా మారి సంపన్నులుగా ఎదుగుతారని ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more