శివునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలానే కొలువున్నాయి. ఈయన క్షేత్రాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క కథను వివరిస్తుంది.
భారతదేశంలో ఉత్తరంవైపు వున్న అమరనాథ్ పర్వతాలలోని అమర్ నాథ్ గుహలు హిందువులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం. ఈ అమర్ నాథ్ గుహలోపల ఒక మంచు శివలింగంలా కనిపించే ఆకృతిని కలిగి వుంటుంది. ఇది వేసవి కాలమయిన మే నుండి ఆగస్టు వరకు వృద్ధి చెంది.. ఆ తరువాత కరుగుతుంది.
పురాణాల ప్రకారం... శివుడు తన భార్య అయిన పార్వతీదేవికీ జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించారు.
స్థలపురాణం :
పూర్వం ఒకనాడు పార్వతీదేవి, ఈశ్వరుడితో... ‘‘నాథా! మీరు కంఠంలో వేసుకునే ఆ పుర్రెమాలగురించి నాకు వినాలని వుంది’’ అని అడిగింది.
అప్పుడు ఈశ్వరుడు... ‘‘పార్వతీ! నువ్వు జన్మించిన ప్రతిసారి నేను ఈ పుర్రెలమాలలో ఇంకొకటి అదనంగా చేర్చుకుని ధరిస్తుంటాను’’ అని బదులిచ్చాడు.
పార్వతీదేవి... ‘‘నేనే మరణించి, తిరిగి జన్మిస్తూనే వుంటాను. కానీ నువ్వు మాత్రం అలాగే శాశ్వతంగా అమరుడిగా వుంటున్నావు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగింది.
ఈశ్వరుడు... ‘‘పార్వతీ! ఇది ఎంతో రహస్యమైంది. కాబట్టి ఏ ఒక్క ప్రాణిలేని ప్రదేశంలో నీకు వివరంగా చెప్పాలి’’ అని చెప్పి... ఏ ప్రాణజీవి లేని అమరనాథ్ గుహ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు.
ఇలా ఈ విధంగా శివుడు పహల్ గాం వద్ద నందిని వుండమని ఉపదేశించి, చందన్ వారి చంద్రుడిని వదిలివెళ్లాడు. అలాగే పాములను, గణేషుడిని, పంచభూతాలను ఆకాశంలో తమతమ ప్రదేశాలలో వదిలేసి ఈ అమరనాథ్ గుహలకు చేరుకున్నాడు.
ఆ ప్రదేశంలో వున్న అన్యప్రాణులను ఇతర ప్రదేశాలకు పంపి, తన అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడే పైనున్న ఒక పావురాల జంట గుడ్లరూపంలో ఈ అమరత్వ రహస్యాన్ని విని.. అవి కూడా అమరులు అయ్యాయని కథనం.
రెండవ కథ :
పూర్వం ఒకనాడు బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి వుండేవాడు. అతనికి ఒకరోజు ఒక సన్యాసి బొగ్గులతో నిండి వున్న సంచిని ఇచ్చాడు. ఆ గొర్రెల కాపరి సంచిన తీసుకుని ఇంటికి వెళ్లి చూస్తే.. అందులో వున్న బొగ్గులన్నీ బంగారు నాణేలుగా మారాయి.
బూటా మాలిక్ ఆ సన్యాసికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తే... అప్పటికే సన్యాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ.. అక్కడ ఆ కాపరికి ఒక మంచు ఆకృతిలో వున్న శివలింగం కనిపించింది.
ఈ విధంగా మంచు లింగం ఆకారంలో వున్న శివుడు.. పురాతన కాలం నుంచి ప్రస్తుతకాలంలో వున్న ప్రజలకు దర్శనం ఇస్తూ వస్తున్నాడు.
గుహ విశేషాలు :
అమరనాథ గుహలు ఉత్తర భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమరనాథ పర్వతాలలో వున్నాయి. జమ్మూకాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ నుంచి దాదాపు 114 కిలోమీటర్ల దూరంలో, 3888 మీటర్ల ఎత్తులో వుంది.
మే నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ ఆలయం సుమారు 45 రోజులవరకు తెరిచివుంటుంది. దాదాపు 4 లక్షలమంది వరకు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారని అంచనా.
హిందువుల మాసాలలో పుణ్యమాసమైన శ్రావణమాసంలో వుంటుంది.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more