రామాయణము, మహాభారతము, భాగవతము మొదలైన సాంస్కృతిక సంపదలు మనకు మన పూర్వీకులైన మహుఋషుల నుండి లభించాయి. ‘‘రామాయణం’’ ఒక మహా కావ్యం. దీనిని ఆది కవి అయిన శ్రీ వాల్మీకి రచించారు. ఈ కావ్యం ద్వారా మనం మన కుటుంబీకులైన తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు వంటి వారితో ఆదర్శంగా ఎలా వుండాలోనన్నది క్లుప్తంగా విశ్లేషించడమైనది. ‘‘రామాయణం’’ అంటే ‘‘రామ’’, ‘‘అయనము’’ అనే రెండు పదాలు కలిసి రామాయణము అయింది. అయనము అంటే మార్గము. అంటే.. రాముడు అనుసరించిన మార్గము అని అర్థం. ఈ రామాయణంలో రాముడు తన ధర్మాన్ని అనుసరిస్తూ.. తాను నడిచిన ధర్మ మార్గాన్ని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనము.
రామాయణంలో మొత్తం 24వేల శ్లోకాలు వున్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడి వున్నాయి. రామాయణంలోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో (అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలుంటాయి) రాయబడ్డాయి. రామాయణం మొత్తం ఒక కథలా నడుస్తుంది. ఇందులో వున్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలైన పాత్రలు మన సంస్కృతీకి ప్రతీకలు. రామాయణం హిందూ మతంలోనే కాదు... బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో వుంది. మన దేశంలోనే కాక ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా వంటి మొదలైన దేశాలలో కూడా అమలులో వుంది. రామాయణం కూడా మహాభారతంలాగే అనేక దశలలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. రామాయణము అత్యంత పురాతనమైన ప్రతి క్రీ.పూ.11వ శతాబ్దమునకు చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందింది. క్రీ.పూ.4, 5 శతాబ్దాలకు చెందిన రామాయణం ప్రస్తుత రూపంలోకి వచ్చింది.
వాల్మీకి రచించిన ఈ రామాయణాన్ని ఇతర భాషలకు చెందిన మహానుభావులు.. తమతమ భాషలలో, తమతమ శైలిలో అనువదించుకున్నారు. అందులో ముఖ్యమైనది క్రీ.పూ. 11, 12 శతాబ్దాలలో కంబన్ అనే కవి రచించిన కంబరామాయణం. అలాగే తెలుగుభాషలో మొల్లచే ‘‘మొల్ల రామాయణం’’, 14వ శతాబ్దంలో కన్నడ రచయిత నరహరి రచించిన ‘‘తొరవె రామాయణ్’’, 15వ శతాబ్దంలో కృత్తివాస ఓఝా బెంగాలిలో రచించిన ‘‘కృతివాస రామాయణం’’, 16వ శతాబ్దంలో తులసీదాస్ అవధూత చేత హిందీలో ‘‘రామచరిత మానస్’’గా రచింపబడింది. రామాయణంలో ఈ విధంగా రకరకాల రామాయణాలు వున్నట్టే.. రామాయణం గురించి, రామాయణ కాలం గురించి రకరకాల అభిప్రాయాలు వున్నానేది తెలుస్తుంది. రామాయణం గురించి రోమిలా థాపర్ అనే చరిత్రకారిణి ఇలా అన్నారు.
పాళీ భాషలో రాయబడిన బుద్ధ జాతక కథలలో రామాయణం వుంది. అందులో కాశీ రాజు దశరథుడు. రాముడు, లక్ష్మణుడు, సీత అన్న చెల్లెలు. వీరు ముగ్గురు దశరథుని మొదటి భార్య పిల్లలు. దశరథుడు తన రెండవ భార్య నుంచి వీరిని కాపాడటానికి హిమాలయాలకు పంపి వేస్తాడట. దాదాపు పన్నెండేళ్ల తర్వాత వీరు కాశీకి తిరిగి వచ్చి, రాజ్యాభిషిక్తులయ్యారు. ఇందులో రావణుడు సీతను అపహరించడం గురించి లేదు. ఇక జైనుల రామాయణంలో అయితే లక్ష్మణుడు రావణున్ని వధిస్తాడు. రాముడు ఆఖరులో సన్యాసం తీసుకొని తీర్థాంకరుడై మోక్షాన్ని పొందాడు. ఇది వాల్మీకి రచించిన రామాయణం కంటే చాలా భిన్నంగా వుంటుంది. దీనిని బట్టి మనకు తెలిసిందేమిటంటే.. రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకున్నారు. కానీ అన్నింటిలో కల్లా వాల్మీకి రామాయణం అత్యంత ప్రాచీనమైంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అందుకే వాల్మీకి ఆది కవి అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Nov 13 | రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు.... Read more
Oct 08 | పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు. ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు, అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి... Read more
Jul 03 | అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి... Read more
Jun 14 | పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని... Read more
Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more