పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై వుంచి బొట్టుపెట్టి పూజ మొదలుపెట్టాలి.
శుక్లాంబరధరం విష్ణుం శవివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానా మేకదంతముపాస్మహే
శ్లోకము : గురుర్ర్బహ్మ గురువిష్ణు : గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై: శ్రీగురువేనమ:
ఇంటిలో ఈశాన్యంలో స్థలమును శుద్ధిచేసి - అలికి - బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి దైవస్థాపన కొరకు పీట వేయాలి. పీట మరి ఎత్తుగా గాని, మట్టంగా గాని వుండకూడదు. పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టుపెట్టి బియ్యపు పిండితో చక్కగా ముగ్గువేయాలి. అష్టదళ పద్మం వేయాలి. ఒక పళ్లెంలో బియ్యంపోసి, దానిపై తమలపాకుతో గణపతిని వుంచాలి. పీటకు వైరుతిదిశలో దీపారాధనచేసి అగరువత్తులు వెలిగించి ముందుగా కేశవనామాలు ఆచమనం చేయాలి. ముందుగా పసుపు గణపతికి పూజచేసి ఆ పిదప శ్రీవైభవలక్ష్మీకి పూజ ప్రారంభించాలి.
పసుపు గణపతి పూజ
పసుపు గణపతికి ఎడమ ప్రక్కన దీపారాధనచేసి సంకల్పము చెప్పుకొనవలెను. ‘‘ఆచమ్మ’’ అని ఆచమనం చేయవలెను.
ఆచమనం : కుడిచేతి చూపుడువేలుకు, నడిమివేలుకు మధ్యన బొటనవ్రేలుంచి, చూపుడువేలును బొటనవ్రేలుపైకి మడిచి తక్కిన మూడువేళ్లుదాచి, అరచేతిని దోనెలా మడిచి ఉద్దరిణెడు ఉదకాన్ని ఎడమచేతితో కుడిచేతిలో పొసుకుని, ముందుగా ఓం కేశవాయస్వాహా అంటూ త్రాగవలెను. ఓ నారాయణస్వాహా అనుకుని ఒకసారి ఓం మాధవాయ స్వాహా అనుకుని ఒకసారి జలం పుచ్చుకోవాలి. ‘‘ఓం గోవిందాయనమ:’’ అని చేతులు కడుగవలెను. తరువాత ‘‘ఓం విష్ణవే నమ:’’ అనుకుంటూ నీళ్లను తాకి కళ్లు తుడుచుకోవాలి.
అటుపిమ్మట ‘‘మధుసూదనాయ నమ:’’
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం వామనాయ నమ:
ఓం శ్రీధరాయ నమ:
ఓం హృషీకేశాయ నమ:
ఓం పద్మనాభాయ నమ:
ఓం దామోధరాయ నమ:
ఓం సంకర్షణాయ నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం ప్రద్యుమ్నాయ నమ:
ఓం అనిరుద్ధాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం అధోక్షజాయ నమ:
ఓం నారసింహాయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం జనార్ధనాయ నమ:
ఓం ఉపేంద్రాయ నమ:
ఓం హరయే నమ:
ఓం శ్రీకృష్ణయ నమ:
అంటూ కేశవనామాలతో ప్రారంభించవలెను.
ఆత్మశుద్ధి :
‘‘అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో పవా
య: స్మరేత్పండరీకాక్షం - సబాహ్యంభ్యంతరశ్శుచి:’’
అంటూ స్నానం చేసినట్లుగా అనుకుంటూ తలపై జలం చెల్లుకోవాలి.
భూశుద్ధి :
‘‘ఉత్తిష్ణంతు భూతపిశాచా యేతే భూమి భారకా:
ఏతేషా మవిలోధేన బ్రహ్మకర్మ సమారభే’’
అంటూ చుట్టూ నీళ్లు చల్లుకోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శవివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానా మేకదంతముపాస్మహే
అంటూ పసుపు, కుంకుమ అక్షతలు వినాయకునిపై వుంచాలి.
శ్లోకము : అపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యహం
శ్లోకము : యశ్శివో నామరూపాభ్యం యాదేవీ సర్వమంగళా
శరణ్యే త్ర్యంబకే దేవి! నారాయణి నమోస్తుతే
కుడిచేతితో ముక్కును పట్టుకుని ప్రాణామయ మంత్రం పఠించవలెను.
ఓం భూ: ఓం భవ: ఓం సువ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్సవితువరేణ్యం భర్గోదేవస్యధీమహీ
థియో యోన: ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతి రసోమతం బ్రహ్మభూర్భువస్సువ రోమ్.
అటు పిమ్మట సంకల్పం చెప్పవలెను.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more