ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో తన వెనుక ఎవరో ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని టీడీపీ నేత హరికృష్ణ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో వైసీపీలో చేరుతామన్నవారు అధినేతకు తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. గడ్డితిని మాట్లాడాల్సిన అవసరం లేదని, తనది నీతివంతమైన రాజకీయమన్నారు. తన తండ్రి ఆశయం కోసం పోరాడుతానని హరికృష్ణ స్పష్టం చేశారు. రాహుల్ను ప్రధానిని చేసేందుకే రాష్ట్ర విభజన అని, సోనియా స్వార్థానికి రాష్ట్రం బలి అవుతోందని ఆయన ఆరోపించారు. తెలుగువారి కోసం పార్లమెంటులో పోరాడుతున్నందుకే బాలకృష్ణ కుమార్తె వివాహానికి హాజరుకాలేదని వివరించారు. టీఆర్ఎస్తో పొత్తు టీడీపీకి ముప్పు అని అనాడే అధినేతకు చెప్పానని తెలిపారు. టీఆర్ఎస్ నేత హరీష్రావుపై హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని తాను ఆస్తులు సంపాదించలేదన్నారు. హరీష్రావు విజ్ఞతతో మాట్లాడాలని హరికృష్ణ సూచించారు.
విభజన జరిగితే సంక్షోభం..
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ సంక్షోభంలో పడిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ రైతు సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రైతులతో సీఎం అన్నారు. కేంద్రం ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more