తెలంగాణ అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూనే...మరో వైపు దేనికైనా రెడీ అంటున్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే పదవులు వదులుకుంటాం తప్ప...పార్టీని వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఎం కూడా రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎవరెప్పుడు రాజీనామా అస్త్రాలు సందించాలనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
రాజీనామాలకు రెడీ
సీమాంధ్ర నేతలంతా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే పదవులు వదులుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఐతే..పార్టీని మాత్రం వీడేదిలేదని చెబుతున్నారు. ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, ఐతే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటున్నారు. తమ ప్రాంత ప్రజలకు ఇష్టం లేని నిర్ణయాన్ని తీసుకుంటే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
విభజిస్తే సీఎం రాజీనామా!
రాష్ట్రాన్ని విభజించటం సీఎం కిరణ్కు ఏ మాత్రం ఇష్టం లేదని విభజన అనివార్యమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తారని బాహటంగానే సీమాంధ్ర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజీనామాలు చేయటానికి వెనకాడమని సీమాంధ్ర మంత్రులు తేల్చిచెబుతున్నారు.
గ్రేటర్ రాయలసీమ డిమాండ్
రాయల సీమను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మంత్రి టిజి వెంకటేష్ కోరారు. విభజన అనివార్యమైతే గ్రేటర్ రాయలసీమను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కొత్త ఫార్ములాను చెబుతున్నారు. టిడిపి, వైసీపీలు సమైక్యాంధ్రకు లేఖ ఇస్తే రాష్ట్రాన్ని ఏ శక్తీ విడదీయలేదని అభిప్రాయపడ్డారు.
సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి
సమైక్యరాష్ట్రంతోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రవాసుల నెత్తురు, చెమట దాగుందన్నారు. సమైక్యరాష్ట్రం కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణపై రాజకీయపార్టీల వైఖరితోనే ఈపరిస్థితి ఏర్పడిందని ఆనం వివేకా ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితం
సమైక్యాంధ్రకు మద్దతివ్వని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను సీమాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమైందని చెప్పారు. కేవలం సీఎం కిరణ్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సమైక్యంగాఉంటే సీమాంధ్రలో 20 ఎంపీ సీట్లను ప్రజలు అప్పగిస్తారని స్పష్టం చేశారు. లేకుంటే సీమాంధ్ర నేతలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more