గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అంతకుముందు ప్రాంగణంలోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో చంద్రబాబు సంతకం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణంలో నారా చంద్రబాబు నాయుడి మైనపు బొమ్మను నెలకొల్పారు. సరిగ్గా చంద్రబాబు కూర్చున్నట్లుగానే ఉన్న ఆ ప్రతిమను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దీవీ శ్రీనివాసనాయుడు చంద్రబాబుకు బహూకరించారు.
ఈ ప్రతిమకు చంద్రబాబు దుస్తులనే తొడిగారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అక్కల శ్రీరాం దీన్ని రూపొందించారు. విక్టరీ చూపిస్తూ చంద్రబాబు మైనపు బొమ్మ ఉండటంతో అభిమానులు, కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సహం కనిపించింది. ఇదిలావుంటే, మహానాడులో చంద్రబాబు నాయుడికి కార్యకర్తలు అపురూపమైన కానుకలు అందజేశారు.
హైదరాబాదులోని ముషీరాబాద్కు చెందిన మత్స్యకారుడు శివప్రసాద్ బుల్లి సైకిల్ను చంద్రబాబుకు బహుమానంగా అందించాడు. ఇందులో చేపల బొమ్మలు కూడా ఉన్నాయి. బాబు అధ్యక్షుడిగా నామినేషన్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడి పేరును ప్రతిపాదిస్తూ 24 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు పార్టీ నేత కెఇ కృష్ణమూర్తి చెప్పారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పార్టీ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more