మెట్రోరైలు ప్రాజెక్ట్లను స్వయంగా చేపట్టకపోయినా 'ఎల్అండ్టీ'కి ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోరైళ్ల ప్రాజెక్ట్ పనుల్లో దీని భాగస్వామ్యం చాలా కీలకం. అటువంటిది హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్ట్ను స్వయంగా దక్కించుకున్న ఎల్అండ్టీ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భూముల అప్పగింతలో జాప్యం జరిగినా.. ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇప్పటి వరకు రెండు ప్రధాన కారిడార్లలో భూ పరీక్షలకే పరిమితమైన సంస్థ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయనుంది.
చెన్నై, బెంగళూరు మెట్రో నగరాల ప్రాజెక్టుల్లో పని చేసిన అనుభవం ఉన్న ఇంజనీర్లను నగరానికి రప్పిస్తోంది. మియాపూర్ డిపో పనులకు శ్రీకారం చుట్టిన ఎల్అండ్టీ నిపుణులైన 200 మంది ఇంజనీర్లను అక్కడ వినియోగిస్తోంది.మూడు మాసాల క్రితం ఉప్పల్ కాస్టింగ్ యార్డు, ఉప్పల్ డిపోల్లోనూ పనులను ప్రారంభించిన సదరు సంస్థ అక్కడ పనుల వేగాన్ని పెంచింది. నాగోల్ నుంచి మెట్టుగూడ కారిడార్లో 60కి పైగా పిల్లర్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మరోవైపు రెడీమేడ్ సెగ్మెంట్ల తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. పిల్లర్ల నిర్మాణం కోసం 120 పునాదులను అదనంగా సిద్ధ్దం చేసింది.
ప్రాజెక్టు కీలక దశకు చేరుకోవడంతో నైపుణ్యం ఉన్న కార్మికులను సైతం రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేస్తోంది.శిక్షణ - ఉపాధిమెట్రో ప్రాజెక్టుకు సాంకేతిక అంశాలు కీలకం కావడంతో కార్మికులకు ఎల్అండ్టీ ముందుగా శిక్షణ ఇస్తోంది. వృత్తి నైపుణ్యాన్ని ఒక పక్క పెంచుతూ మరో పక్క వారికి ఉపాధి కల్పిస్తోంది. ప్రాజెక్టు పనుల్లో లోపాలు ఉండకూడదనే లక్ష్యం మేరకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. జడ్చర్ల, ఉప్పల్ కాస్టింగ్ యార్డుల్లో కార్మికులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు..
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more