మీ వీధిలో గుంతలు పడిన తారురోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారా? సిమెంట్ రోడ్డు వేస్తే బాధలు తప్పుతాయని ఆలోచిస్తున్నారా? అయితే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల వద్దకు సిమెంట్ రోడ్డు వేయించుకుందామని వెళ్తే మీకు షాక్ తప్పదు. ఎందుకంటే, అక్కడి రికార్డులలో అప్పటికే మీ వీధిలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేసినట్లు... దానికి గాను కాంట్రాక్టర్కు డబ్బులు కూడా చెల్లించేసినట్లు ఉంటుంది.
ఈ విషయమై ఇప్పటికే నగర పౌరుల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు వెళ్లడంతో ఏం చే యాలా అని జీహెచ్ఎంసీ అధికారులు తల పట్టుకుంటున్నారు. రికార్డులు పరిశీలించి చూస్తే... ఏమాత్రం పనిచేయని చోట కూడా డబ్బులు చెల్లించినట్లు తేలడం సహా.. పలు రకాల లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. దీంతో ఇద్దరు డిప్యూటీ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. వీరిని మాతృ సంస్థ పబ్లిక్హెల్త్ కు సరెండర్ చేశారు.సౌత్ జోన్లో అక్రమాలు సౌత్జోన్లో చేసిన దాదాపు 2000 చిన్న పనులను పరిశీలించి చూస్తే, కేవలం రెండు డివిజన్లలోని 36 కేసుల్లో రూ. 50 లక్షలకు పైగా అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని ఫిబ్రవరిలో రాసిన ఓ లేఖలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. అయితే.. ఇప్పటివరకు బయటపడింది తక్కువ మొత్తమేననీ, జరిగిన మొత్తం అక్రమాలను తవ్వితీస్తే నష్టం కోట్లలో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ముగ్గురు ఇంజనీర్లను మాత్రమే సస్పెండ్ చేసి ఊరుకున్న అధికారులు మిగిలినవారిని చూసీచూడనట్లుగా వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేయని పనులకు కూడా బిల్లులు పెట్టారనీ, కొన్ని పనులను అసంపూర్తిగా చేసి.. పూర్తిచేసినట్లుగా చూపించి వాటికి సొమ్ములు తీసేసుకున్నారని జీహెచ్ఎంసీ స్థాయీసంఘం మాజీ సభ్యుడు ఎం.ఎ. బాసిత్ ఆరోపించారు.
ఈ విషయమై సాక్ష్యాధారాలతో జీహెచ్ఎంసీకి లేఖ రాశానని చెప్పారు. వాస్తవాలను వెలికితీసేందుకు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినా అధికారులు స్పందించలేదన్నారు. కాంట్రాక్టర్లు నిధులు భోంచేయడానికే ఇదంతా జరుగుతోందనీ, పైకి అధికారులు ఇదంతా కేవలం కొన్ని లక్షల వ్యవహారమే అని చెబుతున్నా మొత్తం నష్టం కోట్లలోనే ఉంటుందని ఆయన ఆరోపిస్తున్నారు.రాజకీయ జోక్యం కాంట్రాక్టర్లు.. కొందరు కార్పొరేటర్లు కుమ్మక్కవడంతో చాలా సందర్భాలలో స్నేహితులు, బంధువులకే కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ పద్ధతిలో కేటాయించిన కాంట్రాక్టులను రద్దు చేసే విషయమై గ్రేటర్ యోచిస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిర్ణయం తీసుకోవడం లేదని సమాచారం. ఇప్పటికే కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిపోవడంతో... ఆ మొత్తాన్ని రాబడతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more