ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర విడుదలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ‘మా’ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పై చాలా మంది తప్పుగా అనుకున్నారు. ఒక నిర్మాత ఎంతో కష్టపడి, భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తే... ఇలా విడుదలకు ఒకరోజు ముందుగా తన రెమ్యునరేషన్ బాకీ వున్నాడని, అది నిర్మాత తీర్చలేదంటూ ‘మా’లో ఫిర్యాదు చేయడమేంటని పవన్ కళ్యాణ్ పై చాలా మంది వ్యతిరేకంగా అనుకున్నారు.
ఒక విధంగా చూస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కాస్త పవన్ పై విమర్శలు చేసారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని నిర్మించారు బివిఎస్ఎన్ ప్రసాద్. ఆ సినిమా విడుదలకు ముందే దాదాపు 75శాతం సినిమా లీకయ్యింది. దీంతో ఈ సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తుతాయేమోననే ఉద్దేశ్యంతో దర్శకుడు త్రివిక్రమ్ మరియు హీరో పవన్ కళ్యాణ్ లు తమ రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని నిలిపివేసారు. అయితే విడుదలకు ముందే సినిమా మొత్తం లీకైన కూడా ‘అత్తారింటికి దారేది’ చిత్రం మాత్రం విడుదలై భారీ విజయం సాధించడమే కాకుండా, కలెక్షన్ల మోత మోగించేసింది.
Also Read: ఎగ్గొట్టిన డబ్బులు అడగటం పవన్ తప్పా..?
అదే సమయంలో బివిఎస్ఎన్ ప్రసాద్ తో తాను ఓ సినిమా చేస్తానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటిచ్చాడు. ఎన్టీఆర్ తన మాటను నిలబెట్టుకుంటూ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసాడు. కానీ నిర్మాత మాత్రం తన మాటను నిలబెట్టుకోకుండా ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన డబ్బును మాత్రం ఇవ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ‘మా’లో ఫిర్యాదు చేసారు. ఇదిలా వుంటే తాజా సమాచారం ప్రకారం.. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ ఓ 50 లక్షలు డిస్కౌంట్ చేసినట్లుగా తెలిసింది.
అంటే పవన్ కళ్యాణ్ కు బివిఎస్ఎన్ ప్రసాద్ ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలలో నుంచి 50 లక్షలను తీసేసి, కేవలం కోటిన్నర రూపాయలను చెల్లించమని పవన్ కళ్యాణ్ డిస్కౌంట్ ఇచ్చినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టాక్ ఎలా వున్నాకూడా కలెక్షన్ల మాత్రం బాగానే వస్తున్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన నిర్మాతపై వున్న దయతో ఈ విధంగా 50 లక్షలు తగ్గించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం వుందో లేదో ఆ నిర్మాతే అధికారికంగా ప్రకటించేవరకు తెలియదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చి నెలలో విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more