సంగీతంతో తమ గ్రామానికి బస్సు సర్వీసును రప్పించేలా చేసింది ఓ గాయని. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొని.. తన గాత్రంతో న్యాయనిర్ణేతలనే మెప్పించింది. కంటెస్టెంట్ గా వచ్చిన అమె తన పాటతో అందరి మనసులు గెలుచుకుంది. మరి తమ గ్రామానికి అర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఎలా రప్పించుకుందన్న వివరాలు తెలుసుకోవాలని ఉందా.. ఆ వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..
దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతుల కనిష్ట సంతామనమైన పార్వతి బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకుంది. అమెలోని గాత్రంలోని నైపుణ్యాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. సాధన చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగవచ్చని చెప్పారు. దీంతో పార్వతి ఇంటర్ పూర్తైన తరువాత అమె తల్లిదండ్రులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించారు. అక్కడ ప్రిన్సిపాల్ సుధాకర్, గురువు వల్లూరి సురేష్బాబు వద్ద శిక్షణ తీసు కుంటూ పార్వతి టీటీడీ చానల్ ‘అదిగో అల్లదిగో’ కార్యక్రమానికి ఎంపికయ్యారు.
ఇటీవల జీ తెలుగు చానల్లో సరిగమప సీజన్ లో పార్వతికి చాన్స్ వచ్చింది. ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు. గేయరచయిత అనంత్ శ్రీరామ్ కూడా అమెను ప్రశంసించారు. పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా.. తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు తిప్పాలని కోరారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు.
తన కోసం ఏమీ అడగకుండా తన గ్రామం కోసం బస్సు సర్వీసును కోరడంటో అమెలోని మహోన్నత సామాజిక దృక్పథాన్ని అక్కడున్నవారంతా కోనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రోమోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. లక్షలాది వీక్షకులు తమ మొబైల్ ఫోన్ల నుంచి ఈ పాటను షేర్ చేశారు. పార్వతి విన్నపానికి డోన్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. డోన్ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు.
This promo#SaReGaMaPa pic.twitter.com/0ALFWDGv0m
— Varshini reddy (@iriseye_here) February 16, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more