Tollywood Director KS Nageswara Rao Passes Away ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూత

Telugu director ks nageswara rao passes away following seizure

Telugu Director, KS Nageswara Rao, seizure, passed away, filmmaker, Gudumba Shankar director, Veera Shankar Bairisetty, Kodada, Kodi Ramakrishna, Eluru Hospital, Rickshaw Rudraiah, Krishnam Raju, Jayasudha, POlice, Real Hero Sri Hari, Sambayya, Srisailam, Desadrohi, Tollywood

Director KS Nageswara Rao, who primarily worked in the Telugu film industry, passed away after experiencing a seizure on Saturday morning. According to reports, the filmmaker was on his way back to Hyderabad from his hometown when he suffered the seizure and breathed his last.

టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు నాగేశ్వరరావు కన్నుమూత

Posted: 11/27/2021 03:59 PM IST
Telugu director ks nageswara rao passes away following seizure

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తన స్వగ్రామం నుంచి హైదరాబాదుకు వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. మూర్చరోగం వచ్చిందని స్థానికులు గమనించి ఆయనను హుటాహుటిన అసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ తర్వాత ఆయనను అక్కడ మరో రెండు, మూడు ఆసుపత్రులకు తరలించారు.

అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఏలూరు ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కేఎస్ రామారావు పార్థివదేహాన్ని ఆయన అత్తగారి ఊరైన నల్లజర్ల సమీపంలో ఉండే కౌలూరులో ఉంచారు. అక్కడే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

1986 నుంచి ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. దర్శక దిగ్గజాలలో ఒకరైన కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. 'రిక్షా రుద్రయ్య' సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. దివంగత శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' సినిమాను తెరకెక్కించారు. తాజాగా తన కుమారుడిని పరిచయం చేస్తూ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు. కొన్నాళ్లుగా ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించాలనుకునే సమయంలోనే ఆయన మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Director  KS Nageswara Rao  seizure  passed away  filmmaker  Kodada  Tollywood  

Other Articles