Huge damage for Shyam Singha Roy set నాని 'శ్యామ్ సింగ రాయ్'పై పగబట్టిన వరుణుడు

Huge loss to nani heavy rain destroys sets of shyam singha roy

Shyam Singha Roy, Nani, Sai Pallavi, Madonna Sebastian, Kriti Shetty, Hyderabad set, Kolkata, Rahul Sankrityan, Shyam Singha Roy, nani Shyam Singha Roy movie news, Shyam Singha Roy movie updates,Nani, Shyam Singha Roy, Tollywood, Movies, Entertainment

Natural Star Nani. period drama Shyam Singha Roy that unfolds in Kolkata and Hyderabad and deals with the theme of reincarnation, the project stars Middle Class Abbayi fame Sai Pallavi, Madonna Sebastian and Uppena girl Kriti Shetty as the female leads.

నాని 'శ్యామ్ సింగ రాయ్'కి వరుణుడి శాపం.. సెట్టు తెచ్చిన నష్టం!

Posted: 05/21/2021 06:44 PM IST
Huge loss to nani heavy rain destroys sets of shyam singha roy

న్యాచురల్ స్టార్ హీరో నాని కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక నేపథ్యమున్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంపై వరుణుడు పగబట్టాడా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రకృతి పగబట్టి తౌక్టే తుపాను రూపంలో విరుచుకుపడి కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చినట్టుగానే నాని చిత్రానికి కూడా నష్టాన్ని మిగిల్చింది. దేశవ్యాప్తంగా తీరని ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మిగిల్చిన ఈ ప్రళయం నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రంపై కూడా పూడ్చలేనంత ప్రభావాన్ని చూపింది.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి కూడా తాజాగా వరుణుడు కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చాడు. నాని కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం అవుతోంది. కొల్ కతా నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం ఇక్కడే హైదరాబాద్ లో సెట్ వేశారు. ఈ సినిమా కోసం 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సెట్లు వేశారు. నిన్న మొన్నటి వరకూ ఈ సెట్లోనే కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తూ వచ్చారు. అయితే కరోనా అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో, షూటింగును వాయిదా వేశారు.

అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ సెట్ భారీగానే దెబ్బతిందట. ఇలా జరగడం నిర్మాతకు కొంత నష్టాన్ని కలిగించిందనే అంటున్నారు. సెట్టును ఒకసారి మళ్లీ చెక్ చేసుకుని, తగిన మరమ్మతులు చేసిగానీ షూటింగుకు దిగడానికి లేదట. కరోనా లేకపోతే ఈ పాటికే ఆ సెట్టులో షూటింగు అయిపోయేదనీ, ఈ నష్టం జరగకుండా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో నాని డిటెక్టివ్ గా నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్లుగా సాయిపల్లవి .. కృతి శెట్టి కనిపించనున్నారు. మిక్కీ.జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles