తనను, తన మోగా కుటుంబం హీరోలను, తెలుగు చిత్రసీమను ఇంతలా ఆదరించి తమను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న రాష్ట్రంలోని ప్రజలకు తాను ఏదైనా చేయాలని అలోచనలో బ్లడ్ బ్యాంక్ ప్రారంబించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత ఐ బ్యాంక్ సహా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. ఇటీవల కాలం వరకు తాను చేస్తున్న అనేక తెరవెనుక సహాయాలను కూడా మూడో కంటికి తెలియకుండా చేసిన ఆయన కరోనా నేపథ్యంలో గత ఏడాది కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో పేద సినీ కార్మికులకు సాయాన్ని అందించారు. వారికి మూడు నెలలకు సరిపడా సరుకులను అందజేసి వారి ఆదరణ పోందారు.
ఇలా తన సినీ కుటుంబానికి చెందిన వారి బాగోగులు చూస్తున్న ఆయన తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం కూడా ఏదో చేయాలని భావించారు. కరోనా మహమ్మారి రెండోదశ పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే సమస్య కలకలం రేపింది. తిరుపతి రుయా అసుపత్రిలో పలువురు ఆక్సిజన్ కోరత కారణంగానే అసువులు బాసిన ఘటనతో ఆయన చెలించిపోయారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని ఘటనలను వింటూ ఆయన వారిని అదుకునేందుకు ముందుకు కదిలారు.
తనను తన సినీ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు తన వంతు సాయంగా ఏదైనా చేయాలని మరీ ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో అనేక మంది మరణిస్తున్నారని తెలిసుకున్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత లేకండా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఆయన తనయుడు రాంచరణ్ తో కలసి సంయుక్తంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పి కరోనా తీవ్ర భాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. తన సామాజిక స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more