నటుడు ఆదిత్య మీనన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. పలు చిత్రాల్లో నెటిగివ్ షేడ్స్ వున్న పాత్రలలో నటించిన ఆయన తాజా గాయంతో ఆస్పత్రిపాలయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "హరి హర వీరమల్లు" షూటింగ్లో ఆయన గాయపడ్డారు. ఇటీవల సెట్స్లో గుర్రపు స్వారీ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను ముంబైలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన్ను చెన్నై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఆదిత్య మీనన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు, చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా వుంటే ఆదిత్య మీనన్ 'బిల్లా' సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. గతంలో పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇక అతడికి ప్రమాదం జరిగిన కారణంగా వీరమల్లు.. షూటింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాక్విలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ వజ్రాల దొంగగా ఆలరించనున్నట్లు సమాచారం. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more